- ‘‘తెలుగు చూడాలంటే బాపు... తెలుగు వినాలంటే రమణ. అందుకు నిదర్శనమే ఈ శ్రీరామరాజ్యం.
- ఈ రోజు రాముడిగా నన్ను చూశారు. రేపు ఈ రాముడు పలుకులు ఎలా ఉంటాయో వింటారు. ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు.
- ఆయన తప్ప ఈ కథను ఇంతబాగా తీయగలిగిన వారు లేరు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
- సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘శ్రీరామరాజ్యం’ పాటల అభినందన కార్యక్రమంలో ఆయన పై విధంగా స్పందించారు.
- ఈ వేడుకలోనే బాలకృష్ణ శ్రీరాముడు గెటప్కి సంబంధించిన చిత్రాలను అక్కినేని నాగేశ్వరరావు, కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు.
- ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఇటీవల ఓ వ్యక్తి ఓ పరభాషా దర్శకుడి గురించి గొప్పగా మాట్లాడుతూ మన తెలుగు దర్శకులను అవమాన పరిచాడు.
- అప్పుడే ఆ వ్యక్తికి జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరించాను.
- మనలో గొప్ప సినిమాలు తీసే వారు ఎందరో ఉన్నారు. ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి గొప్ప సినిమాలు తెలుగువారు తీసినవే.
- ప్రపంచ సినీ చరిత్రలో ‘శ్రీరామరాజ్యం’ లాంటి కావ్యాన్ని ఎవరూ తీయలేరు. అది బాపుకు మాత్రమే సాధ్యం.
ఇళయరాజా సంగీతం, జొన్నవిత్తుల సాహిత్యం, యలమంచిలి సాయిబాబు నిర్మాణ దక్షత ఈ చిత్రం ఓ కళాఖండంగా రూపుదిద్దుకోవడానికి కారణం అయ్యింది.
- ‘శ్రీరామరాజ్యం’ సంచలనం సృష్టించడం ఖాయం’’ అన్నారు.
- ‘‘ఈ సినిమాకు నిజమైన హీరోలు బాపు, ఇళయరాజా, యలమంచిలి సాయిబాబు.
- ఇలాంటి సినిమా తీయడం, దానికి రచన చేయడం, సాహిత్యాన్నందించడం, సంగీతాన్ని సమకూర్చడం, నిర్మించడం ఇలా ప్రతీదీ ఒక అగ్ని పరీక్షే.
- ఆ పరీక్షల్లో వారందరూ మొదటి తరగతిలో పాసయ్యారు. ఈ కథను దర్శకుడిగా బాపును ఎన్నుకొని యాభై శాతం విజయాన్ని అందుకున్నారు నిర్మాత సాయిబాబు.
- సంసృ్కతిని పాడుచేస్తున్న సినిమాలు వస్తున్న నేటి తరుణంలో ‘శ్రీరామరాజ్యం’ సినిమా ప్రేక్షకులకు ఒక చల్లని పిల్ల తెమ్మర లాంటిది’’ అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు.
- రామాజ్ఞతోనే ఈ సినిమా తీశానని, బాపును కష్టపెట్టానని నేను అనుకోవడం లేదని, ఇంకా ఇలాంటి కళాఖండాలు ఆయన నుంచి రావాలని నిర్మాత సాయిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇళయరాజా, డి.రామానాయుడు, కృష్ణంరాజు, శ్రీకాంత్, కోడిరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, బాలయ్య, బ్రహ్మానందం, గిరిబాబు, మురళీమోహన్, జొన్నవిత్తుల, ఎం.ఎల్.కుమార్చౌదరి, సాగర్, బద్రీనారాయణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
No comments:
Post a Comment