Sep 11, 2011

సెప్టెంబర్ 15వ తేదీకి తెలుగు సినిమాకు 80 ‍ సంవత్సరాలు.. (80 Years of Telugu Cinema Industry)

(గమనిక... ఇది సేకరించిన సమాచారం మాత్రమే ... అసంపూర్తి గా వుంది పూర్తి సమాచారం మరికొద్ద సేపట్లో..)
ఇంట్రో...
సెప్టెంబర్ 15 .. సరిగ్గా ఎనబై ఏళ్లక్రితం తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద విడుదలై న రోజు .. తెలుగు సినిమాకు మరపురాని, మరువలేని రోజు ఈ సెప్టెంబర్ 15...
కాలం అనే కడలిలో కొత్తనీరు చేరుతూవుంటుంది, మరో వైపు పాత నీరు తెలియనంత దూర తీరాలకు వెళ్లిపోతుంది. ఈ పరిణామానికి సినిమారంగం కూడా అంగీకరిం చవలసిందే. 80 సంవత్సరాల క్రితం 'భక్త ప్రహ్లాద చిత్రంతో శ్రీకారం చుట్టుకున్న తెలుగు సినిమా నడకలో, నడవడిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కథాపరంగాను, కథనరీతిలోను మాత్రమే కాదు, సాంకేతికంగా ఎంతో దూరం పయనిస్తున్న తెలుగు సినిమాకు నిర్దుష్టమైన 'స్వర్ణయుగం అనేది వుండేది. సుమారు పాతిక సంవత్స రాల కాలం రాజ్యమేలిన ఈ స్వర్ణ యుగంలో అత్యంత ప్రతిభావంతు లైన దర్శకులు పలు ఆణిము త్యాల వంటి చలన చిత్రాలను అందించారు. ఆబాలగోపాలాన్ని ఆనందడోలికల్లో తేలియాడించారు. అప్పటి ఆ కళాఖండాలు ఇప్పటికీ గౌరవం పొందుతున్నాయి.



















యాంకర్1

'తెలుగు సినిమా స్వర్ణయుగంలో నిలిచిపోయిన 1950-1975 ఈ పాతిక సంవత్సరాల కాలంలో అద్భుతాలను అందించినవారు, రానున్న తరాలకు ఆదర్శప్రాయు లయిన దర్శకులు: బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, సి.పుల్లయ్య, పి.ఎస్‌. రామకృష్ణ, కమలాకర కామేశ్వర రావు, బి.ఏ.సుబ్బారావు, కె.ఎస్‌. ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, ఎల్‌.వి.ప్రసాద్‌, వేదాంతం రాఘ వయ్య, డి.యోగానంద్‌, తాపీ చాణక్య, పి.పుల్లయ్య, ఆదుర్తి సుబ్బారావు. ఈ పధ్నాలుగుమంది నిర్వివాదంగా తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలు చేశారు. తెలుగు సినిమా స్థాయిని, అంతస్తును దేశీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ దర్శకులు అందించిన చిత్రాలు చాలా వరకు ఇప్పటికీ సజీవంగా వున్నాయి.

యాంకర్1ఎ

ఇక తెలుగు సినిమా సంగీతం గురించి చెప్పుకోవాల్సినపుడు 1940_1960 కాలాన్ని తెలుగు సినిమా సంగీత స్వర్ణయుగంగా పేర్కోంటారు.
సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్ర సంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. సంగీత దర్శకులు, రచయితలు, గాయక గాయనీమణులు శ్రద్ధతో సృష్టించిన అలనాటి ఆ పాటలు మరువరానివి, మరువలేనివి.
హిందీలో అనిల్ బిశ్వాస్, నౌషాద్, సలిల్ చౌదరీ, శంకర్-జైకిషన్, రోషన్, S.D బర్మన్, తెలుగులో రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, గాలిపెంచల, చలపతిరావు, తమిళములో G. రామనాథన్, విశ్వనాథన్-రామమూర్తి, మహాదేవన్, S.V. వెంకటరామన్, కన్నడములో లింగప్ప, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, రంగారావు, వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులతో చిత్రసంగీతం విలసిల్లిన కాలమది. వారిలో కొందరు గొప్ప గాయకులు కూడా... అట్టివారిలో ప్రముఖులు ఘంటసాల, పంకజ్ మల్లిక్, హేమంతకుమార్, S.D బర్మన్, సాలూరి, నాగయ్య, ఏ. ఎం. రాజా. ఇంక ముఖ్యంగా తెలుగు నేపథ్య గాయకుల విషయానికి వస్తే తక్కిన భాషల్లో వారికి లేనంతటి వైవిధ్యం ఇక్కడుంది. ఎం.ఎస్. రామారావు, వి.జె.వర్మ, ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది, ఏ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ల కంఠాలలో ఒకరి దానితో మరొకరికి పోలిక లేదు. ఏ.యం.రాజా 50వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడుగా నిలిచారు.

యాంకర్1బి

తెలుగు సినిమా స్వర‌్ణయుగం గా పెర్కోనే 50, 60 లలో తెలుగు వారికి  షావుకారు, పాతాళబైరవి, పెళ్లిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకధ, సి.ఐ.డి. లాంటి  నవరత్నాలు అనదగ్గ తొమ్మిది చిత్రరాజాలను సగర్వంగా  అందించిన ఘనత విజయా వారికే దక్కుతుంది. విజయసారధులుగా తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు నిర్మాతలు బి.నాగిరెడ్డి, చక్రపాణి . వీరిద్దరు విలువలకు ఏనాడు తిలోదకాలివ్వకుండా రాజీపడని తత్త్వంతోనే సినిమాలు రూపోందించారు.

యాంకర్2

తెలుగులో తొలి పూర్తి నిడివి గల రంగుల చిత్రంగా అలీబాబా 40 దొంగలు వచ్చింది .. అయితే అంతకు ముందే లవకుశ, తెనేమనసులు లాంటి చిత్రాలలో ఒక పాటకానీ , లేదా ఆటగానీ తీసేవారు. అయితే తెలుగులో పూర్తి సినిమాస్కోప్ లో వచ్చిన చిత్రం అల్లూరి సీతారామరాజు కాగా, కృష్ణ హీరోగా, దర్శకనిర్మాతగా రూపోందించిన మొట్టమొదటి 70 యమ్.యమ్. చిత్రంగా సింహాసనం  నిలిచింది.


యాంకర్

నేడు ఆర్ధికం గా కూడా తెలుగు సినిమా బాగా ఎదిగి, 40కోట్ల రూపాయల స్థాయికి చేరింది.  అధికారపరంగా, అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మక పురస్కారాలతో పాటు, నిర్మాణ దశలో ఎన్నో రాయితీలను ఇస్తున్నాయి. వీటన్నిం టిని సద్వినియోగం చేసుకుంటూ, నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచే చిత్రాలను నిర్మించాలను, అందించ వలసిన అవశ్యకత ఎంతైనా వుంది...అందరికీ తెలిసిన ఆర్యోక్తి వుండనే వుందిగా 'ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.

No comments: