skip to main |
skip to sidebar
బాబు అక్రమాస్తులపై విచారణ ప్రారంభం...
- టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై విచారణ చేపట్టాలంటూ వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి.
- పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ వాదిస్తున్నారు.
- ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీస్థాయిలో ఆస్తులు కూడబెట్టారని, తన కుటుంబ సభ్యులకు పలు ప్రయోజనాలు చేకూర్చారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment