ఇదియుం లక్ష్మీ పార్వతి ఉవాచ. నారా లోకేష్ ను ఇంటర్ పాస్ కాలేని దద్దమ్మ అంది. బ్రాహ్మణి ను మాత్రం తెలివైన పిల్ల అంది. ఇలాంటి వాడి చేతికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చిక్కితే ఇంకేమైనా ఉందా... అని హరికృష్ణ కంగారు పడ్డాడు కాబోలు, తన కుమారుడైన జూనియర్ NTR ను రంగం లోకి దింపాడు. ఏమైనా, చంద్రబాబు చరిష్మా ఎపుడోపోయింది. అసలు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకు కూడాబరువయ్యాడు అని కూడా అనేద్దామా...!!!
తెలుగుదేశం పార్టీకు పార్టీ శ్రేణులలో స్ఫూర్తి, చలనం, జీవం నింపేందుకు కొత్త యువనేత అవసరం ఉంది. కానీ జూనియర్ NTR కూడా ఇందుకు పూర్తిగా సరిపోడు. ఇంకా కుర్రతనంలో ఉన్న జూనియర్ సహనం ఓపికలతో పాటు కొంచెం పరిణతి ను ప్రదర్శించాల్సి ఉంది. అవసరమైతే సిని రంగాన్ని వీడడానికి సిద్ద పడాలి. తన మేనత్త పురంధరేశ్వరి ను పార్టీలోకి తీసుకు రాగలిగేలా ఉండాలి. జూనియర్ కు నిజం గా రాజకీయ రంగం పై మోజు ఉంటే, మరో ఆలోచన లేక సిని రంగాన్నివీడితే, తన రాజకీయ భవిష్యత్తు, సిని భవిష్యత్తు కన్నాబాగుంటుంది. చిరంజీవితో పోలిస్తే జూనియర్ ప్రజలలోకి బాగా చొచ్చుకుపోగలడు.
జగన్ ఓదార్పు యాత్ర పేరు తో ప్రచార యాత్ర చేస్తూ ఎప్పటినుండో జనాల్లోకి వెళ్లి పోయాడు. కాంగ్రెస్ పార్టీలో జగన్ ను ధీటుగా ఎదుర్కొంటూ కిరణ్ ను, చిరంజీవిను వెనక్కు నెట్టి బొత్స ఎదుగుతున్నాడు. ఎటుతిరిగి TDP నే చంద్రబాబుతో తంటాలు పడుతోంది. అసలు తెలుగుదేశం పార్టీ ఇంత బలహీనంగా ఉంది గనుకనే, జగన్ పార్టీ ఎదగగలిగింది.
You might also like:
No comments:
Post a Comment