
- కుటుంబ ఆస్తులు వెల్లడించిన బాబు
- వ్యక్తిగత సంపద రూ. 39.88 లక్షలే
- భువనేశ్వరికి రూ. 39.18 కోట్లు
- లోకేష్ రూ. 6.73 కోట్లు
- బ్రహ్మణి రూ 3.22 కోట్లు
- ఇంకా ఉన్నట్లు నిరూపిస్తే రాసిస్తా
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన ఆస్తులను ప్రకటించారు. తన, తన కుటుంబ సభ్యులకు రూ 37.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆస్తులను, భూముల సర్వే నెంబర్లను కూడా ఆయన ప్రకటించారు.అవినీతిపై అన్నా హజారే చేపట్టిన ఉద్యమానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఆయన ఆస్తులపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. తనకు వెయ్యి కోట్లిస్తే తన ఆస్తులను రాసిస్తాన్న చంద్రబాబు చేసిన ప్రకటన మరింత వివాదస్పదమైంది. దీంతో చంద్రబాబు ఆస్తులు ప్రకటించారు. శ-క్రవారం మీడియా సమక్షంలో తన ఆస్తులను వెల్లడించారు. ఆస్తులను వెల్లడించడంతో తనపై కొందరు చేస్తున్న ఆరోపణలకు ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. తనకు ఇంకా ఆస్తులున్నాయని, ఎవరైనా నిరూపిస్తే వాటిని తిరిగి వారికే రాసిస్తానని సవాల్ విసిరారు. తాను ప్రకటించిన ఆస్తుల వివరాలు ప్రస్తుత మార్కెట్ విలువ మేరకు కాదని, కాలానుగుణ మార్పులతో మార్కెట్ విలువలో హెచ్చు తగ్గులుంటాయని చంద్రబాబుచెప్పారు. 2004-09 మధ్య తన ఆస్తులు, తన భార్య ఆస్తులు అసెంబ్లీకి సమర్పించామని గుర్తు చేశారు.రాజకీయ నాయకులు కుటుంబ ఆస్తులన్నీ వెల్లడించిన దాఖలాలు దేశ చరిత్రలో ఇంతవరకూ లేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ల ఆస్తులు ప్రజలకు తెలియాల్సిన ఆవసరం ఉందన్నారు. తనకు రూ 39.88 లక్షల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్య భువనేశ్వరికి రూ 39.18 కోట్లు ఉన్నాయని, ఆమెకు అప్పులు రూ 12.38 కోట్లు ఉన్నాయన్నారు. కొడుకు లోకేష్ ఆస్తుల విలువ రూ 6.73 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్థి రూ.3.22 కోట్లు ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో మణికొండ గ్రామంలో కోటి 15 లక్షల విలువ గల ప్లాట్ ఉన్నదని, అడ్వాన్స్ చెల్లించినా ఇంకా రిజిస్టర్ కాలేదన్నారు. తన కోడలుకు ఆస్థి ఆమె తండ్రి నందమూరి బాలకృష్ణ నుండి సంక్రమించిందని చెప్పారు. తన కుటుంబానికి నిర్వహణ హోల్డింగ్ ప్రై.లి కంపెనీ ఉందని, దాని విలువ రూ 38.06 లక్షలని తెలిపారు. తన, కుటుంబ సభ్యుల ఆస్తి విలువ రూ 37.92 కోట్లేనన్నారు. హెరిటేజ్లో తనకుటుంబ సభ్యుల వాటా రూ 48 శాతం ఉందని, మిగిలినది పబ్లిక్ షేర్లు అని తెలిపారు.అందులో తన భార్య రూ 19.95 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు గుర్తు చేశారు. మదీనాగూడ గ్రామంలో లోకేశ్ పేరిట ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. మహారాష్ట్రషోగన్లో 8.4 ఎకరాలు, హుబ్లీ సమీపంలోసజ్జాపూర్ వద్ద ఎమ్రా గ్రామంలో రూ.60.54లక్షల విలువైన 3.17 ఎకరాల భూమి ఉందన్నారు. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో 71.40 ఎకరాల ఉమ్మడి వ్యవసాయ భుమి ఉందని, అందులో 3.74 ఎకరాల భూమిని ఆ గ్రామంలో ఆసుపత్రి, గోదాం, ఫంక్షన్ హాలు నిర్మాణానికి దానం చేసినట్లు చెప్పారు. తనకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టమన్నారు. ఈ కారణంగానే హైటెక్సిటీ వద్ద మూడు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాన్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో 86 ఎకరాలు కొన్నట్లు చెప్పారు. ఈ భూమి వివాదంలో మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థనరెడ్డి తనను వేధింపులకు గురి చేశారని గుర్తు చేశారు. ఆ భూమిలో 9.33ఎకరాలను వికె రవీంద్రకుమార్కు, వెంకట దిలీప్కుమార్ 13.36లకు అమ్మేశామన్నారు. ఆ ప్రాంతంలో తన పేరున విద్యుత్ కనెక్షన్ లేదని, తన బావ కె చంద్రబాబునాయుడు పేరిట విద్యుత్ కనెక్షన్ ఉందన్నారు. ఆయన మరణించి 15 ఏళ్లు అవుతుందన్నారు. తనపై బురద జల్లేందుకే వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించలేదని పరోక్షంగా వైఎస్ జగన్నుద్దేశించి అన్నారు. వ్యాపార రంగంలో తన కుటుంబాన్ని ప్రొత్సహిస్తున్నానని చెప్పారు. సింగపూర్లో తనకు సెంటు భూమి ఉందని ఎవరైనా పూర్తి ఆధారాలతో నిరూపిస్తే దాన్ని వారికే రాసిస్తానని సవాల్ చేశారు. ఆస్తుల వివరాలను ఎన్నికల సమయంలోనే ఇస్తున్నామని, కావాలంటే ప్రతి ఏడాది ఇస్తానని చెప్పారు. అయితే తన ఆస్తులు ప్రకటించమని ఎవరూ కోరలేదని, నేను ఎవరినీ డిమాండ్ చేయడం లేదన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆస్తులు ప్రకటిస్తారా అని ప్రశ్నిస్తే పొలిట్బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు చట్టాల్లో మార్పులు చేసి ఆస్తులు సంపాదించేందుకు మూడు నెలలు మారటోరియం విధించారని విమర్శించారు. ఎవరైనా వ్యాపారాలూ, వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తే తప్పులేదన్నారు. అక్రమంగా సంపాదిస్తేనే తప్పు అన్నారు. కాగా జుబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం 1122 చదరపు గజాల్లో ఉంది. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ గజం భూమి విలువ కనీసం రు.60వేల చొప్పన ఉంటుంది. ఆ ధర ప్రకారం దాని విలువ దాదాపు 7 కోట్లకు పైమాటే.
ఇవే చంద్రబాబు ఆస్తులు
జూబ్లీ హిల్స్లో ఇల్లు విలువ(తాకట్టులో ఉంది).............రూ 23.20 లక్షలు
అంబాసిడర్ కారు.........................రూ 1.52
ఇతర ఆస్తులు..............................రూ0.01
బ్యాంకులో నిల్వ...........................రూ 15.16
మొత్తం.....................................రూ 39.88 లక్షలు
No comments:
Post a Comment