Sep 18, 2011

రీ-రికార్డింగ్‌లో శ్రీరామరాజ్యం

raamaraajyamరోజూ ఉదయాన్నే రీలు చూసుకోవడం..సన్నివేశానికి బార్‌ కౌంట్‌ రాసుకోవడం..70మంది ఆర్కెస్ట్రా బృందంతో లైవ్‌ పరికరాలతో రీరికార్డింగ్‌ చేయడం..ఇదీ ఇళయరాజా నిత్యకృత్యం. పాటలను మించి నేపథ్య సంగీతం కోసం శ్రమిస్తున్నారాయన’’ అన్నారు నిర్మాత సాయిబాబు. ఆయన శ్రీ సాయిబాబా మూవీస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. బాలకృష్ణ శ్రీరాముడు. నయనతార సీత. శ్రీకాంత్‌ లక్ష్మణుడు. డాఅక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి. బాపు దర్శకత్వం వహించారు. ముళ్లపూడి వెంకటరమణ రచయిత. ప్రస్తుతం ఈ సినిమాకి రీరికార్డింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మరిన్ని విశేషాలు మాట్లాడుతూ ‘‘రెండు కీబోర్డుల పద్ధతికి స్వస్తి చెప్పి రొటీన్‌కి భిన్నంగా ఇళయరాజా రీరికార్డింగ్‌ చేస్తున్నారు. దేశంలోని అరుదైన టింపనీ వాయిద్య పరికరాన్ని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. అదేగాక హంగరీ నుంచి 9మంది స్పెషలిస్టు సంగీతకారులను కూడా రప్పించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: జొన్నవిత్తుల.

No comments: