Sep 18, 2011

బెంగాల్‌ టైగర్‌

భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే రామ్మోహన్‌రాయ్‌ పేరు, సతీసహగమనమును రూపుమాపడం తో ముడిపడి చిరస్థారుుగా నిలిచిపోరుుంది. రామ్మోహన్‌రాయ్‌, హిందూ పూజారుల అధికారమును ధిక్కరించి అ కాలములో బహుభార్యత్వము నేరమని జనులకు నచ్చచెప్పారు

బ్రహ్మ సమాజంతో వివిధ మతములలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతముగా ఎదిగారు. 1831లో మెుఘల్‌ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండుకు వెళ్లారు. ఫ్రాన్స్‌ను కూడా దర్శించారు. ఇంగ్లాండ్గలోని స్టేపెల్‌ టన్‌, బ్రిస్టల్‌లో సెప్టెంబరు 27, 1833లో రామ్మోహన్‌ రాయ్‌ మెదడువాపు వ్యాధితో మరణించారు. తరువాత అక్కడ ఆయన శిలావిగ్రహం ప్రతిష్టింపబడింది.

Raja_Ram_Mohanరాజా రామ్మోహన్‌ రాయ్‌ మే 22, 1772 బెంగాల్‌లో జన్మించారు. భారతదేశంలో బ్రహ్మసమాజ్‌ స్థాపించి మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించారు. ఆయన విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్య రంగములలోనే కాకుండా హిందూమతంపై కూడా కనపడుతుంది. ఆయన ఒక గొప్ప సంఘసంస్కర్త. బ్రిటీష్‌ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశారు.

వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికారు. స్ర్తీవిద్యకై పాటుపడ్డారు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశారు. 1828లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్‌తో కలసి బ్రహ్మసమాజ్‌ను ప్రారంభించారు. బ్రహ్మసమాజ్‌ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్‌లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్‌ రాయ్‌, బెంగాల్‌సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్యుడిగా గుర్తింపును పొందారు.

బాల్యము విద్యాభ్యాసము: రాయ్‌ రాధానగర్‌, బెంగాల్‌లో 1772లో జన్మించారు. కుటుంబములో మతపరమైన వైవిధ్యము కలదు. తండ్రి రామ్కాంత్‌ వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతమునకు చెందినది. రామ్మోహన్‌ బెంగాలీ, పర్షియన్‌, అరబిక్‌, సంస్కృత భాషలను పదిహేనోయేడు వరకు అభ్యసించారు. యుక్తవయస్సులో కుటుంబ ఆచారాములతో సంతృప్తి పొందక, యాత్రలు సానించడము మొదలు పెట్టారు. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తెరిగి వచ్చి కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారారు. 1803 నుండి 1814 వరకు బ్రిటీిష్‌ ఈస్టిండియా కంపెనీలో పనిచేశారు.

సంఘ సంస్కరణలు: భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే రామ్మోహన్‌రాయ్‌ పేరు, సతీసహగమనమును రూపుమాపడం తో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయింది. రామ్మోహన్‌రాయ్‌, హిందూ పూజారుల అధికారమును ధిక్కరించి అ కాలములో బహుభార్యత్వము నేరమని జనులకు నచ్చచెప్పారు.

విలువలు: తాను సంకల్పంచిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్‌ మానవత్వమునే ప్రధానముగా తీసుకున్నారు. జనులకు తన ఉద్దేశ్యము సమాజములో ఉన్న మంచి సాంప్రదాయములను నిర్మూలించడం కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని నిరూపించేందుకు కష్టపడెను. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రములను చదివారు. విగ్రహారాధనను ఖండించారు. ఆఖండానందమును పొందుటకు, ఆధ్యాత్మిక చింతన, భగవంతుని ధ్యానము ఉన్నత మార్గములని ప్రతిపాదించారు. వితంతు పునర్వివాహము, మహిళలకు ఆిస్తి హక్కులను సమర్థించారు. బహుభార్యత్వమును ఖండించారు.

అందరికీ విద్య అవసరమన్నారు. ముఖ్యముగా మహిళలకు విద్యను సమర్థించారు. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మంచిదని భావించి, సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించారు. 1822లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించారు. తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారములను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజమును ప్రారంభించారు.

No comments: