Sep 18, 2011

‘‘నేటి సమాజంలో సినిమా-సంస్కృతి జోడు గుర్రాలు. సినిమా మాధ్యమం సమాచారాన్ని ప్రజలకు చేరవేసే..ఓ ఆయుధం. ప్రజలలో చైతన్యానికి ఈ సాధనం ద్వారానే ముందుకెళ్లడం సముచితం. అందుకే ‘హ్యాపి ఇండియా’ ప్రారంభించాం’’ అంటున్నారు ఎపి మీడియా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.రమేష్‌బాబు. ఈ సంస్థ ద్వారా సినిమాని ప్రజలకు చేరవేస్తూనే.. విద్య, వైద్యం, రక్షణ.. తదితరాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారాయన. ఈ సందర్భంగా ‘కలర్స్‌’తో ఆయన చెప్పిన విశేషాలివి..

హ్యాపి ఇండియా అంటే..దేశంలోని ప్రజలంతా కనీస సౌకర్యాలను సాధించుకుని హ్యాపిగా ఉండడం అనేది అర్థం. దీని సాధన కోసం మేం ఓ కొత్త కాన్పెప్టుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యత్నిస్తున్నాం. మేం ఆచరించాలనుకున్న దానిని సినిమా ద్వారా జనాల్లోకి తీసుకెళుతున్నాం. ‘హ్యాపి ఇండియా’ పేరుతో ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, రక్షణ వంటివి..వారికి సవ్యంగా అందేలా కృషి చేయదలిచాం. అందుకోసం దేశవ్యాప్తంగా ‘హ్యాపి ఇండియా’ కార్యక్రమాలు చేపడుతున్నాం.

‘హ్యాపి ఇండియా’ వసుదైక కుటుంబంలోని..మేధావులు, విద్యావంతులు ..సామాజిక సంస్కరణ దిశగా..తమవంతు సమయాన్ని కేటాయించి ..ప్రజల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తారు. వాక్‌ ఆన్‌ ‘హీల్స్‌’ అనేది మా పద్ధతి. హెల్త్‌, ఎడ్యుకేషన్‌, లిక్విడిటీ, సెక్యూరిటీ...ఇది హీల్స్‌ అనే పదానికి నిర్వచనం. దీనికోసం ఓ కాల్‌సెంటర్‌ సైతం నిరంతరం పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ‘హ్యాపి ఇండియా’ ఏజెంట్ల ద్వారా ఈ కార్యకలాపాలను ప్రజలలోకి తీసుకెళుతున్నాం. ‘హ్యాపి ఇండియా’ సభ్యులు..ఏ సమస్యలో ఉన్నా..వెంటనే అందుకు పరిష్కారానికి కృషి చేస్తాం.

‘హ్యాపి ఇండియా’ మెంబర్‌షిప్‌కి ముందుగా ఓ దరఖాస్తు ఫాం నింపాల్సి ఉంటుంది. ఏడాది పాటు మెంబర్‌షిప్‌కి రూ.500 చెల్లించాలి. దాంతో సినిమాలు ఉచితంగా చూసే అవకాశం సహా హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ (ఇఫ్కో టోకియో ద్వారా)ను అందజేస్తున్నాం.

ప్రత్యేక షోలు...
మా మెంబర్స్‌ కోసం ప్రత్యేక షోలను ఉదయం ఆటగా వేస్తాం. ఈ నెల 23న విడుదలవుతున్న మహేష్‌ చిత్రం ‘దూకుడు’ నుంచే ఇది మొదలవుతుంది. ‘ఊసరవెల్లి’ ‘శ్రీ రామరాజ్యం’..ఇలా కొత్త సినిమాలన్నీ ప్రత్యేక షోలు వేస్తున్నాం. ప్రతి సభ్యునికి ఓ టిక్కెట్‌ ఉచితం. తొలుత హైదరాబాద్‌నుంచే ఇదంతా ప్రారంభించి..నెమ్మదిగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తాం. అక్టోబర్‌ 1న సంస్థ తొలి వార్షికోత్సవం రోజున మేం నిర్మించే సినిమాని ప్రకటిస్తాం.

happy‘ఠాగూర్‌’ , ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘గణేశ్‌’ చిత్రాల తరహాలో ప్రజా సమస్యల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించనున్నాం. ఈ సినిమాల ద్వారా వచ్చే లాభాలను ఫౌండేషన్‌ సేవాకార్యక్రమాలకు వినియోగించనున్నాం. సంస్థ సభ్యుల నుంచి వచ్చే డబ్బులో 20శాతం ఫౌండేషాన్‌ నిధుల కింద జమచేసి మిగతా మొత్తాన్ని ప్రజల కోసం వినియెగిస్తాం.

వెబ్‌లో వివరాలుంటాయి...
నిత్య కార్యకలాపాలు, సినిమాలు, ఈవెంట్‌ల వివరాలు..హ్యాపీ ఇండియా డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే సభ్యులకు ఏపిమూవీస్‌.కామ్‌ ద్వారా తాను చూడాలనుకుంటున్న సినిమా సహా ఆ రోజును తెలియజేయవచ్చు. ఎప్పటికప్పుడు స్పెషల్‌ షో వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. హ్యాపీ ఇండియా డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌ను రాష్ట్ర పౌరసరపరాల శాఖామాత్యులు డి.శ్రీధర్‌బాబు ఇటీవల ఆవిష్కరించారు. ఏపిమూవీస్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ను దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌, సభ్యత్వ నమోదు పత్రాన్ని మరో దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఆవిష్కరించారు.

No comments: