
మీరే జారుకుంటామంటే ఎలా?
‘సకల జనుల సమ్మె అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్నాం. ప్రాణాలకు తెగించి తాడో-పేడో తేల్చుకునే దిశగా సమ్మెను తీసుకెళ్తున్నాం. అయినా మీరు (ఆర్టీసి నాయకులు) పాల్గొన్న తరువాతే సమ్మె ఉధృతరూపం దాల్చింది. సకల జనుల సమ్మె ప్రభావం ఏమిటో అందరికీ తెలిసింది. అటువంటింది మీరే జారుకుంటామంటే ఎలా? ఈ ఉద్యమాన్ని మీరు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి. వెనక్కి వెళ్లే ఆలోచనను మానుకోండి..’ అని కోదండరామిరెడ్డి తొలుత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
మన ప్రజలను మనమే ఇబ్బంది పెడుతున్నాం..
అయితే..ఆయన అభిప్రాయాలను జెఎసి నాయకులు కొంత విభేదించారు. ‘మన తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ప్రతి కుటుంబమూ ఈ పండుగను సంతో షాలతో జరుపుకొంటుంది. వాడవాడలా బతుకమ్మలను ఆడుతూ ఆనందంతో గడుపుతారు. ఆర్టీసి సమ్మె వల్ల ఎవ రూ ఎటూ కదల్లేక పోతున్నారు. మన ప్రజలను మనమే ఇబ్బందులకు గురి చేసినట్టు అవుతున్నది..’ అని జెఎసి నాయకులు ఆయనకు నచ్చజెప్పారు. వాస్తవ పరిస్థితులను వివరించారు.
ఆర్టీసి సమ్మె కొనసాగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా వారు కోదండరామిరెడ్డికి స్పష్టం చేశారు.వచ్చేనెల 2న సమ్మె నుంచి విరామం తీసుకుని, అవసరమైతే దసరా సెలవుల తరువాత మళ్లీ సమ్మెకు వెళ్తామని వారు స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనితో కొద్దిగా మెత్తబడిన కోదండరామిరెడ్డి అక్టోబర్ 2 నుంచి ఆర్టీసి సమ్మెను తాత్కాలికంగానైనా విరమించడానికి సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఆయనే స్వయంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment