తెలంగాణ కాంగ్రెస్ వేరు కుంపటి?

- తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
- కాంగ్రెస్ పార్టీ వీడి కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు పావులు కదుపుతున్నారు.
- కాంగ్రెస్ పార్టీని వీడేందుకు 20 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఆరుగురు మంత్రులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
- తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించి, టీఆర్ఎస్లో చేరుతున్న సంగతి తెలిసిందే.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ‘ఇది అంతం కాదిది ఆరంభం’ అని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు.
- కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భగా కేసీఆర్ మాట్లాడారు.
- ఉద్యమంలోకి రావడానికి ఇంకా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు.
- కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకోలేదని నిరూపించుకోవడానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
- డిసెంబర్ 9 తేది ప్రకటన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో కలిసి చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.
- ఏ పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగకపోతే తెలంగాణ ప్రాంత వాసులు కట్టు బానిసలుగా బ్రతుకాల్సి వస్తుందని ఆయన ప్రజల్ని హెచ్చరించారు.
- తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment