సూపర్స్టార్ రజనీకాంత్తో కలసి నటించడం మధురానుభూతిని కలిగించిందని
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ పేర్కొన్నారు. ఈ బాద్షా సోమవారం చెన్నైలో
సందడి చేశారు. తీయని మాటలతో, చక్కని డ్యాన్స్తో తమిళ ప్రేక్షకులను ఖుషీ
చేశారు. ఈయన నటించిన రా ఒన్ చిత్రం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా తెరపైకి
రానుంది. కరీనాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక గౌరవ
పాత్రను పోషించడం విశేషం. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని నటించిన తొలి
చిత్రం ఇదే.
కాగా ఈ చిత్రాన్ని ఈరోజ్ ఇంటర్నేషనల్, రెడ్
చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా తమిళ ప్రేక్షకులకు
అందిస్తున్నాయి. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం
సోమవారం ఉద యం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. ఆడియోను ప్రముఖ
దర్శకుడు మణిరత్నం ఆవిష్కరించగా తొలి సీడీని అభిరామి రామనాథన్
అందుకున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ రా ఒన్ చిత్రంలో రజనీకాంత్తో
కలసి నటించడం మదురానుభూతిని ఇచ్చిందన్నారు. చిన్నతనం నుంచి తాను ఆయన
అభిమానినని పేర్కొన్నారు. ఆయన సినిమాలు చూస్తూ ఎదిగిన వాడినని
పేర్కొన్నారు.
ఆయన మెస్మరైజింగ్ నటన గురించి వర్ణించడం సాధ్యం
కాదన్నారు. కోలీవుడ్లో మణిరత్నం, కె.బాలచందర్ లాంటి గొప్ప సాంకేతిక
నిపుణులతో పాటు కమలహాసన్ వంటి గొప్ప కళాకారులు ఉన్నారన్నారు. కమల్
అద్భుతమైన నటుడని కితాబిచ్చారు. అయనతో హేరామ్ చిత్రంలో నటించడం గొప్ప
అనుభవం అని అన్నారు. అలాగే అజిత్తో అశోకా చిత్రంలో కలిసి నటించే అరుదైన
అవకాశం కలిగిందన్నారు. రా ఒన్ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరిస్తుందని షారుఖ్
ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,
సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
|
No comments:
Post a Comment