
నేటి యువ హీరోల్లో మహేష్బాబు, ఎన్టీఆర్కు యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. మాస్ విషయంలో ఎన్టీఆర్ కాస్త ముందున్నారు. చివరిసారి మహేష్ నటించిన 'ఖలేజా', ఎన్టీఆర్ 'బృందావనం' ఒకే సమయానికి విడుదలై, పోటీ పడ్డాయి. ఇప్పుడు తాజాగా మరోమారు తెరపై పోటీపడుతున్నారు. వీరద్దరూనటించిన 'దూకుడు', 'ఊసరవెల్లి' ఒక వారం తేడాలో వస్తున్నాయి. దూకుడు ఈనెల 23న రిలీజ్ అవుతోంది. దసరాకి ఊసరవెల్లి రానుంది. ఈ రెండు సినిమాలూ భారీ బడ్జెట్తో తెరకెక్కినవి. అంతేగాక బిజినెస్ విషయంలోనూ రెండు సినిమాలూ రికార్డుల్ని తిరగరాస్తున్నాయి.
'దూకుడు' సినిమా శాటిలైట్ ప్రసార హక్కులు ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ హిస్టరీలో ఇదో రికార్డ్. మరి, జూనియర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' శాటిలైట్ రేట్ ఎంత పలికింది ! అంటే...ఐదున్నర కోట్లు. జెమినీ టీవీ 'ఊసరవెల్లి' శాటిలైట్ రైట్స్ని సొంతం చేసుకుంది. అంటే బిజినెస్ పరంగా ఎన్టీఆర్ కాస్త వెనకబడినట్టే కనిపిస్తున్నాడు. మాస్ ఫాలోయింగ్ విషయంలో మహేష్ కన్నా ఎన్టీఆర్ చాలాముందున్నప్పటికీ, శాటిలైట్ రైట్స్ విషయంలో క్లాస్ హీరోకే ఎక్కువ రేటు పలికిందన్నది స్పష్టమవుతోంది.
దాదాపు ఒకేసారి కాకపోయినా...ఓ వారం అటూ ఇటూగా...దూకుడు, ఊసరవెల్లి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఏ సినిమా బాక్సాఫీస్ బద్దలు గొడుతుందో...చూడాలి ! పైగా అటు మహేష్బాబుకు, ఇటు ఎన్టీఆర్కు ఈ సినిమా విజయం సాధించటం ముఖ్యం.
No comments:
Post a Comment