Sep 27, 2011

బియ్యం ధర తగ్గింపు వెనుక మతలబేమిటో !

మన రాష్ట్ర ప్రభుత్వం క్రూర జంతువులా వెంటాడి, వేటాడి మరీ ధరల పెంపుతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ధరల నియంత్రణ ఎత్తేసి అడ్డూ అదుపు లేకుండా భావిస్తోంది. సామాన్యుని నడ్డివిరుస్తోంది. 

ఖజానా నింపుకోవడం కోసం ధరల పెంపుదలే సరైన మార్గంగా భావిస్తోంది. పెట్రోల్‌ ధర పెంపు, గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య కుదింపు, నిత్యావసర సరుకుల వ్యాట్‌ పెంపుతో పేదవారు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం కుదేలవుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుతోంది. ఇన్నిసార్లు ధరలు పెంచడం వలన ప్రజలు చీత్కరిస్తున్నారీ ఈ ప్రభుత్వాన్ని. ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని మూటగట్టుకోనుంది. మన దేశంలోనే అత్యధికంగా ప్రజలపై భారాలు వేసింది మన రాష్ట్ర ప్రభుత్వమే అంటే ఆశ్యర్యం లేదు. మన పాలకులు ప్రజలపై భారాలు వేయడంలో ఎంత సిద్ధహస్తులో, ఎంత ముందంజలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా తెల్ల రేషన్‌ కార్డులకు బియ్యాన్ని కిలో రూపాయకే ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులను మౌనంగా భరిస్తున్న ప్రజలు ప్రభుత్వం తాజా ప్రకటన విశ్వసించారనడంలో సందేహం లేదు. ఈ ఎర చూపి మరే పన్నులు విధిస్తారోనని వారు భయపడుతున్నారు. భారాల్ని మోస్తున్నారు కదా భారాలు మోపుతూ పోతే మున్ముందు తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది.

No comments: