Sep 7, 2011

పటిష్టమైన లోక్ పాల్ బిల్లు అమలు పరిస్తే మధ్యతరగతి బ్రతుకులు కుదేలే.......

http://blog.sonaljhuj.com/wp-content/uploads/2010/11/sp-studio-copy.jpg
ఒక్క ఉదాహరణ:
పోలీస్ డిపార్ట్మెంట్ ను తీసుకోండి.
అందులో పని చేసే వారు మరియు వారి వేతన శ్రేణిని ( నెలకు షుమారు.) తీసుకోండి.
హోమ్ గార్డు
 6,000
పోలీస్ కానిస్టేబుల్
13,000
సబ్ ఇన్స్పెక్టర్
20,000

ఒక పోలిస్ కానిస్టేబుల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకరు ఇంజినీరు మరొకరు పదవ తరగతి చదువుతున్నారు.
సంవత్సరానికి ఇంజోనీరింగు ఫీజు 3,1000 + 5,000 + extra( కాలేజీ బట్టి ) మరియూ హాస్టల్ ఫీజు 40,000 మరియూ ఇతర ఖర్చులు కలిపి సంవత్సరానికి  మొత్తం 90,000 అంచనా మాత్రమె . పడవ తరగతి పిల్లాడికి కనీసం లేదంటే  15,000.
సంవత్సరానికి పిల్లల చదువులకు అయ్యే మొత్తం అక్షరాలా లక్ష రూపాయలు క్రాస్ అవుతుంది.
కూరగాయలు ,సరుకులకు నేలకు 5,000 చొప్పున 60,000 .
ఒక సంవత్సరంలో ఇంట్లో నలుగురికి బట్టలకు అయ్యే ఖర్చులు కనీసం 15,000 .
బండికి పెట్రోలు, ఆటో ఖర్చులు నేలకు 3000 చొప్పున సం. నికి కనీసం 36,000 .
సం .కి ఆరోగ్యానికి లేదంటే కనీసం 10,000 పెట్టాల్సిందే .
ఒక మధ్యతరగతి కుటుంబానికి  మొత్తం సంవత్సరానికి అయ్యే సగటు ఖర్చు  :
1,00,000 + 60,000 + 15,000 + 36,000 + 10,000 + extra = 2,25,000 పైన
ఖర్చులు తగ్గించుకుందాం అని ప్రభూత్వ ఆసుపత్రులలో చూపించుకున్దామనుకుంటే ప్రాణాలకు గ్యారెంటీ లేదు.
ప్రభూత్వ పాతశాలలో చదివిద్దాం అనుకుంటే ఈ పోటీ ప్రపంచ సాగరంలో  మన పిల్లలు ఈదగలరా...
యెంత లేదన్నా మొత్తం మీద సంవత్సర ఖర్చులు  2,00,000 – 3,00,000 మధ్య ఉంటాయి.
సంవత్సర ఆదాయం =1, 70,000

అందువలన కుటుంబాన్ని నెట్టుకొని రావడానికి  ప్రతీ ఉద్యోగి అవినీతికి పాల్పడాల్సి వస్తుంది. ఆ డబ్బు ఎవరి నోరు కొట్టి సంపాదిస్తున్నాము అని ఆలోచనలకు రాక పోవచ్చు.
ఈ సమస్య ఒక పోలీసు డిపార్ట్మెంట్ లో మాత్రమె కాదు అన్ని శాఖల్లో ను ఉంది.
పోనీ ప్రభూత్వం వీరి జీతాలను మారుస్తుందా అంటే అదీ లేదు. ఎప్పుడో PRC జరిజితేనే ........ అది కూడా సమాజ పరిస్థితులకు అనువుగా ఉండదు. 
కానీ  M.L.A , M.P , టి.టి.దే. అర్చకులు మాత్రం లక్షలకు లక్షలు డిమాండ్ చేసి వారి జీతాలు పెంచుకుంటారు..!! 
దీని పరిష్కారానికి మార్గాలు ఉన్నాయా ? అంటే ఉన్నాయి
పటిష్టమైన లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందితే  ప్రభూత్వం మరికొన్ని అంశాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది.
అవి
  • ·         ప్రభూత్వ ఆసుపత్రులను అత్యున్నత అదునాతన పరికరాలతో మెరుగు పరచాలి. ( ప్రతీ ప్రభూత్వ ఉద్యోగి, రాజకీయ నాయకులు  కూడా చూపించుకునటంతగా ). లేక ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఆరోగ్య సదుపాయాలూ కల్పించాలి. ఎందుకంటె డబ్బులు లేక పోయినా మన  ప్రాణాలు రక్షించుకోగాల్గాలి కదా.
  • ·         అర్హులైన అందరికీ K.G నుంచి P.G వరకు ఉచిత విద్యను అందించాలి. ఈ కాలం లో పిల్లల చదువు కేవలం తమ తల్లిదండ్రుల వ్రుత్తి మీదనే ఆధారపడి ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం.  
  
ప్రభూత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇవి.
ఒక మద్య తరగతి వాడికి ఈ రెండు అంశాలలోనే డబ్బులు చాలా వరకూ ఖర్చు అవుతుంది.
మిగిలిన ఖర్చులు తన జీతం తో నిర్వహించగలడు.
ఈ  అంశాలను ప్రభూత్వం పట్టించుకోకపోతే నిజంగా మధ్యతరగతి బ్రతుకులు కుదేలే...................
విశ్లేషణ : అరవింద్

No comments: