Sep 11, 2011

రిలయన్స్ కేటాయింపులపై సీపీఎం ధ్వజం !


న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కేజీ బేసిన్‌లో గ్యాస్ తవ్వకాల్లో నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని కాగ్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో వ్యాపారవర్గాలకు, పాలకులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు మరోసారి ప్రజలకు తెలిశాయని సీపీఎం వ్యాఖ్యానించింది. నిబంధనలను అతిక్రమించి ఇష్టానుసారం గ్యాస్‌ను సేకరిస్తున్న రిలయన్స్‌ను నియంత్రించి, ఆ అదనపు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని పార్టీ పొలిట్ బ్యూరో శనివారం ఓ ప్రకటనలో కోరింది. అనుమతించిన ప్రాంతానికి మించి 95 శాతం వరకు అదనపు స్థలంలో సదరు సంస్థ గ్యాస్ కోసం అన్వేషణ చేసిందని ఆరోపించింది. వేల కొద్దీ చదరపు కిలో మాటర్ల ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుందని ఆరోపించింది. ఈ విషయంలో యూపీఏ సర్కారు తక్షణం స్పందించాలని, లాలూచీకి పాల్పడిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్‌ను, పెట్రోలియం శాఖలోని ఉన్నతాధికారులను విచారిస్తే అసలు వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొంది.

1 comment:

Anonymous said...

Why government (politicians) worry about this biggest cheater of the country who is eating all natural resources.reliance is also a biggest contributor to political parties fund.I feel Anna hajarey bill should cover these culprits of the country as well.