మన లక్ష్మీపుత్రుల ఐశ్వర్యం ఐసులా నెమ్మదిగా కరిగిపోతోందట! ద్రవ్యోల్బణం, అవినీతి కుంభకోణాల వల్ల భారత్లో వంద మంది అత్యంత ధనవంతుల సంపద గతేడాదితో పోలిస్తే.. 20 శాతం మేర తగ్గిపోయిందని ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘2011 భారత కుబేరుల జాబితా’ ప్రకారం.. దేశంలో అత్యంత సంపన్నులైన తొలి 100 మంది మొత్తం సంపద గతేడాది రూ.14.79 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాది అది రూ.11.88 లక్షల కోట్లకు పడిపోయింది. అటు బిలియనీర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. టాప్-100లో ఈ ఏడాది 57 మందికే(గతేడాది 72 మంది) చోటు దక్కింది. సెన్సెక్స్, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి. 
ఏడాది కాలంలో రూ. 21 వేల కోట్లు హరీ అన్నా.. భారతీయుల్లో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ యజమాని ముకేష్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద విలువ రూ.1.11 లక్షల కోట్లని ఫోర్బ్స్ తెలిపింది. అన్న సంగతిలా ఉంటే.. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ అందరి కంటే ఎక్కువ నష్టపోయారు. 2004లో ఈ జాబితాలో అడుగుపెట్టిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది టాప్-10లో ఆయనకు స్థానం దక్కలేదు. రూ.29 వేల కోట్ల సంపదతో 13వ స్థానంతోనే సరిపుచ్చుకున్నారు. ఆయనపై 2జీ కుంభకోణం ప్రభావం పడిందని ‘ఫోర్బ్స్’ తెలిపింది. శాతాల లెక్క తీసుకుంటే.. ల్యాంకో ఇన్ఫ్రాటెక్ మధుసూదన్రావు అందరికంటే అత్యధికంగా దెబ్బతిన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఆయన సంపద 78 శాతం మేర తగ్గిపోయింది.
ఈ ఏడాది కొత్తగా 14 మంది టాప్-100లో చోటు దక్కించుకున్నారు. వీరిలో ముత్తూట్ ఫైనాన్స్కు చెందిన జార్జ్ ముత్తూట్, కేఫ్ కాఫీ డే రిటైల్ కాఫీ షాప్ చైన్ను స్థాపించిన వి.జి.సిద్ధార్థ, ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన కపిల్, రాహుల్ భాటియాలు ఉన్నారు. ‘భారత కుబేరులకు ఈ ఏడాది కష్టతరంగా గడిచింది. భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధితో ఉన్నా.. అవినీతి కుంభకోణాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి సంపద క్షీణతకు కారణమయ్యాయి’ అని ‘ఫోర్బ్స్ ఏసియా’ ఇండియా ఎడిటర్ నజ్నీన్ కర్మాలీ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 12న షేర్ల ధరలు, ఎక్స్ఛేంజ్ రేట్ల ఆధారంగా వీరి సంపద విలువను లెక్కించినట్లు ‘ఫోర్బ్స్’ తెలిపింది. ఏడాది కాలంలో టాప్-100లో కేవలం 19 మంది సంపదే పెరిగింది. వీరిలో సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ, హీరో గ్రూప్ అధినేత బి.ఎం.ముంజాల్ ఉన్నారు. టాప్-100లో స్థానం కోల్పోయిన వారిలో 2జీ కుంభకోణంలో చిక్కుకుని ప్రస్తుతం జైలులో ఉన్న వినోద్ గోయంకా, షాహిద్ బల్వా ఉన్నారు.
ఏడాది కాలంలో రూ. 21 వేల కోట్లు హరీ అన్నా.. భారతీయుల్లో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ యజమాని ముకేష్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద విలువ రూ.1.11 లక్షల కోట్లని ఫోర్బ్స్ తెలిపింది. అన్న సంగతిలా ఉంటే.. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ అందరి కంటే ఎక్కువ నష్టపోయారు. 2004లో ఈ జాబితాలో అడుగుపెట్టిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది టాప్-10లో ఆయనకు స్థానం దక్కలేదు. రూ.29 వేల కోట్ల సంపదతో 13వ స్థానంతోనే సరిపుచ్చుకున్నారు. ఆయనపై 2జీ కుంభకోణం ప్రభావం పడిందని ‘ఫోర్బ్స్’ తెలిపింది. శాతాల లెక్క తీసుకుంటే.. ల్యాంకో ఇన్ఫ్రాటెక్ మధుసూదన్రావు అందరికంటే అత్యధికంగా దెబ్బతిన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఆయన సంపద 78 శాతం మేర తగ్గిపోయింది.
ఈ ఏడాది కొత్తగా 14 మంది టాప్-100లో చోటు దక్కించుకున్నారు. వీరిలో ముత్తూట్ ఫైనాన్స్కు చెందిన జార్జ్ ముత్తూట్, కేఫ్ కాఫీ డే రిటైల్ కాఫీ షాప్ చైన్ను స్థాపించిన వి.జి.సిద్ధార్థ, ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన కపిల్, రాహుల్ భాటియాలు ఉన్నారు. ‘భారత కుబేరులకు ఈ ఏడాది కష్టతరంగా గడిచింది. భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధితో ఉన్నా.. అవినీతి కుంభకోణాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి సంపద క్షీణతకు కారణమయ్యాయి’ అని ‘ఫోర్బ్స్ ఏసియా’ ఇండియా ఎడిటర్ నజ్నీన్ కర్మాలీ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 12న షేర్ల ధరలు, ఎక్స్ఛేంజ్ రేట్ల ఆధారంగా వీరి సంపద విలువను లెక్కించినట్లు ‘ఫోర్బ్స్’ తెలిపింది. ఏడాది కాలంలో టాప్-100లో కేవలం 19 మంది సంపదే పెరిగింది. వీరిలో సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ, హీరో గ్రూప్ అధినేత బి.ఎం.ముంజాల్ ఉన్నారు. టాప్-100లో స్థానం కోల్పోయిన వారిలో 2జీ కుంభకోణంలో చిక్కుకుని ప్రస్తుతం జైలులో ఉన్న వినోద్ గోయంకా, షాహిద్ బల్వా ఉన్నారు.
No comments:
Post a Comment