Sep 3, 2011

అల్లుడు గురించి "అన్న" గారి మాటలు !

‘చంద్రబాబు బతకనేర్చినవాడు... అందుకే 1983లో ఓటమి తర్వాత మా పంచన చేరాడు... ఆయన కరడుగట్టిన స్వార్థపరుడు... ఆయన అవినీతికి అడ్డుతగులుతున్నాననే నాకు వెన్నుపోటు పొడిచారు.. విశాఖపట్నం నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నప్పుడు నా కాళ్ళ వద్ద పెట్టె వున్న కారణంగా నేను కాళ్ళు ముడుచుకు కూర్చుంటే నా కాళ్ళు నొప్పి పెడతాయని, నా కాళ్ళ ముందున్న పెట్టెను అక్కడి నుంచి తీసిన ఆయన (బాబు) హైదరాబాద్ చేరగానే నా వీపులో విచ్చు కత్తులు దించుతాడని ఎట్లా ఊహించమంటారు?’..ఇవీ ఘనత వహించిన దశమగ్రహం గురించి దివంగత నందమూరి తారక రామారావు చివరి పలుకులు.

‘బాబు కుట్రకు ఒక పత్రికాధిపతి కొమ్ముకాశారు... ఆ పత్రిక, దాని అధిపతి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టంలేదు... విషప్రచారంలో ఆయన గోబెల్స్‌నే మించిపోయారు... ఆయన నా మీదే పెత్తనం చెలారుుంచాలనుకున్నాడు... అది కుదరకపోయేసరికి మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించసాగారు... తమ స్వార్థపూరిత కుట్ర, రాజకీయూల కోసం నా బిడ్డలను కూడా రెచ్చగొట్టారు..’ ఇవీ.. రాజగురివిందపై ఎన్టీఆర్ వ్యాఖ్యలు. నమ్మి పిల్లనిచ్చిన ఇంటల్లుడితో రాజగురువు పన్నిన కుట్రకు ఆయన బలైపోయారు. అధికారాన్ని దూరంచేసి, కన్నబిడ్డలను వేరుచేసి కడుపుకోతను రగిల్చిన ఆ ఇద్దరి దుర్మార్గం ఆయనను పొట్టనపెట్టుకుంది. 1995 ఆగస్టు 16 నుంచి జరిగిన సంఘటనలపై తన మరణానికి కొద్ది రోజుల ముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వారిద్దరిపై నిప్పులు చెరిగారు. ‘తెలుగు ప్రజలకు ఎన్‌టీఆర్ వీలునామా’ పేరుతో నవయుగ బుక్ హౌస్ ప్రచురించిన ఆ ఇంటర్వ్యూలోని కొంత భాగమిది...

చంద్రబాబు బతకనేర్చినవాడు, స్వార్థపరుడు

ఒకప్పుడు నేను మా బాలయ్య (బాలకృష్ణ)ను నా రాజకీయ వారసుడిగా తీసుకురావాలని భావిస్తున్నట్టు ప్రకటన చేశానని కొన్ని పత్రికలు ప్రచురించారుు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసత్వ రాజకీయూలకు అవకాశమెక్కడ? ఒకే కుటుంబంలోని వారే అరుునా వారి వారి యోగ్యతా యోగ్యతలపై ఆధారపడి వుంటుంది. వారు తమ స్వార్థపూరిత కుట్ర, రాజకీయూల కోసం నా బిడ్డలను కూడా రెచ్చగొట్టారు. నా కుటుంబ సభ్యులు చాలామందితో మాపై వ్యతిరేకత కల్పించడానికి, పెంచడానికి ప్రయత్నించారు. నాపై వారు కుట్ర పన్నడానికి ఇవే ప్రధానమైన కారణాలుగా నేను భావిస్తున్నాను.... చెప్పానుగా, బాబు బతక నేర్చినవాడని, స్వార్థపరుడని. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అధికార పెత్తనం చేపట్టడానికి కాంగ్రెస్‌కు చెందిన కొందరితో కూడా సంప్రదింపులు జరిపాడ ని మాకు తెలిసింది. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆ ఎన్నికలకు ముందే బెంగళూరులో సమావేశమైనట్టు మాకు తరువాత సమాచారం అందింది.

మీరే చెప్పండి... విమానంలో నా శ్రేయోభిలాషిగా వ్యవహరించిన వ్యక్తి హైదరాబాద్‌లో విమానం దిగగానే విషప్పుచ్చుగా మారుతాడని ఎలా అనుకోగలను? 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎక్కువ సంఖ్య ఓట్ల తేడాతో ఓడిపోయూడు. అరుునా బ్రతుకనేర్చినవాడు కనుక తదుపరి మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా పంచన చేరారు. అల్లుడనే భావంతోనే మేము ఆయనకు పార్టీలో అవకాశం కల్పించలేదు. నా కూతురు అటువంటి విషయూల్లో ఎప్పుడూ జోక్యం కలిగించుకోలేదు. పార్టీలోని ముఖ్యులంతా ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని నాకు సలహా ఇచ్చారు కూడా. అరుునా వారి మాటను కాదని పార్టీలోకి ప్రవేశం కల్పించాను. ఒక స్వార్థపరుడికి ఎలాంటి మనః ప్రవృత్తి వుంటుందో తెలుసుకోలేకపోయూను.

బాబు కుట్ర వెనుక ఒక పత్రిక, దాని అధిపతి

నాపై కుట్ర పన్నడానికి ఉన్నదొక్కటే కారణం. చంద్రబాబులోని కరడుగట్టిన స్వార్థం. వారి అవినీతికి నేను అడ్డుతగులుతున్నాననే వెన్నుపోటు పొడిచారు. తప్పుడు పద్ధతుల ద్వారా లక్షలకు లక్షలు సొమ్ము చేసుకునే వారి దుర్విధానాలను మేం సమర్థించలేకపోయూం... అడ్డుచెప్పాం. అటువంటి అవినీతి చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశాం. (కొంతసేపు మౌనం). అక్రమ విధానాల ద్వారా అమాయకులను, స్వార్థపరులను ఎలా ఆకట్టుకోవడమో బాబుకు బాగా తెలుసు. బాబు అవినీతి ఇనుపతెరవెనుక సాగిందేమీ కాదు కనుక మా పార్టీలో చాలామందికి ఆ విషయూలు తెలుసునని నేను అనుకొంటాను.

బాబు వెనుక కొన్ని పత్రికల బాధ్యతారహితమైన ప్రమేయం కూడా ఉందని వెల్లడించడానికి నేను విచారిస్తున్నా. ఒక పత్రికాధిపతి గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆ పత్రిక పేరు, దాని అధిపతి పేరు ఉచ్చరించదలచుకోలేదు. తెలుగునాట తెలివివున్న ప్రతి పాఠకునికి ఆ విషయూలు తెలుసు. వారు తిమ్మిని బమ్మి చేశారు... సత్యాలకు స్వస్తి చెప్పారు. వాస్తవాలకు వికృత వ్యాఖ్యలు కల్పించి ప్రచారం చేయడం ద్వారా గోబెల్స్ గుండెల్లో గుబులెక్కించారు. ఆయనకంటే ఆ విద్యల్లో ఆ పత్రికవారు మించిపోయూరు. (కొంచెం బిగ్గరగానే నవ్వి) అవును బ్రదర్... చరిత్ర పునరావృతం కాకూడదని మనమనుకుంటాం... కానీ ఇటువంటి పత్రికాధిపతులు గోబెల్స్ వంటి లేదా అటువంటి వారిని మించిన చారిత్రక పాత్ర నిర్వహించడానికి అప్పుడప్పుడు పుడుతుంటారు. తాత్కాలికంగా చరిత్ర గమనాన్ని కొంత, చాలా కొద్దిమేరకు దారి తప్పించగలుగుతారు. ఆ మేరకు సమాజానికి హాని చేస్తారు. అరుుతే చరిత్ర గమనం గతి తప్పిపోదు. చరిత్ర నిర్మాతలైన ప్రజలు మళ్ళీ తమ మానవ సమాజ చరిత్ర రథగమనాన్ని సవ్యమైన మార్గంలోకి, దివ్యపథంలోకి మళ్ళిస్తారు. తాత్కాలికంగా చరిత్రను తమ గుప్పిట్లోకి తెచ్చుకొన్నామని, కాలానికి కళ్ళెం వేశామని భావించి అటువంటి దుర్మదాంధులు, స్వార్థపరులు చివరికి చరిత్ర విసిరేసిన పెంటకుప్పల్లో మాత్రమే ఉండిపోతారు.

పిచ్చి కార్టూన్లు... పిచ్చి రాతలు

అవాకులు చెవాకులు వదిలిపెట్టి చెప్పమనండి ఆ పెద్దమనిషిని... నేను అధికారాన్ని దుర్వినియోగం చేశానా? అవినీతికి పాల్పడ్డానా? అక్రమార్జనలకు పూనుకొన్నానా? ప్రజలే నా దేవుళ్ళని, సమాజమే దేవళమని నమ్మి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే నాకు ఎందుకు ద్రోహం చేస్తున్నాడో ఆ పెద్దమనిషిని (పత్రికాధిపతి) చెప్పమనండి. ప్రజలు వారిని నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. వారైనా, రేపు మీరైనా సరే సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని అందలమెక్కించాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊర్కోరు. పత్రికలున్నది ప్రజల బాగుకోసం. పత్రికా స్వేచ్ఛ ఉండేది ఆ కర్తవ్యాల నిర్వహణ కోసం. అంతేగానీ నా చేతిలో పత్రిక వుందికదా అని నానా రాతలు రాస్తూ బాధ్యతలు విస్మరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారు. స్త్రీలను గౌరవించడం తెలియని అనాగరికపు జులారుుతనం తప్ప వారి ఆరోపణల్లో, వారి రాతల్లో, వారి కార్టూనుల్లో మరేమిటి వ్యక్తం అవుతోంది బ్రదర్? పిచ్చి కార్టూన్లు....... పిచ్చి రాతలు.

ఆ పత్రికాధిపతి నాపై పెత్తనం చేయాలనుకున్నాడు

నేను రాజకీయూల్లోకి ప్రవేశించేనాటికి నాకు ఆయన (పత్రికాధిపతి)తో పరిచయం కూడా లేదు. నటుడిగా, కళాకారుడిగా చలనచిత్ర జీవితంలో నేను వివిధ పాత్రలను పోషిస్తూ సమాజం నుంచి పేదల నుండి పొందిన స్పందన ఫలితంగానే నేను రాజకీయూల్లోకి వచ్చాను. కొన్ని దశాబ్దాల క్రితమే నన్ను రాజకీయూల్లోకి రమ్మని పూజ్యులు నీలం సంజీవరెడ్డిగారు ఆహ్వానించారు. ఎంపీ టికెట్టు ఇస్తాను ఎన్టీఆర్, మా పార్టీలో చేరమని కాసు బ్రహ్మానందరెడ్డిగారు కోరారు. అప్పుడు వారి కోరికలను నేను మన్నించలేకపోయూను. నేను తెలుగుదేశం పార్టీని స్థాపించాక కొందరు మిత్రులు ఈ పత్రికాధిపతిని పరిచయం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించి మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పెద్దమనిషిని (పత్రికాధిపతిని) రాష్ట్ర ప్రణాళికా అభివృద్ధి మండలి అధ్యక్షులుగా ఉండమని కోరాను... తరువాత ఎంపీ సీటు కూడా ఆఫర్ చేశాను. ఆ పత్రికాధిపతి నేను ఆఫర్ చేసిన పదవుల్ని నిరాకరించాడుగానీ... నా మీదే పెత్తనం చెలారుుంచాలనుకున్నాడు. నన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకొన్నాడు.

ఆయనకు తాబేదారుగా వుండటానికి, ఆయనకు మద్దెల కొట్టడానికి, భజన చేయడానికి నేను అంగీకరించలేదు. నేను తెలుగువాణ్ణి... స్వాభిమానపరుడ్ని... ఆత్మగౌరవాన్ని అవసరం కోసం అంగడి సరుకుగా మార్చుకోవడానికి ససేమిరా ఇష్టపడని వాణ్ణి... వ్యక్తిత్వ పరిరక్షణకు ప్రాణాలనైనా తృణప్రాయంగా భావించేవాణ్ణి. ఎన్టీఆర్ చండశాసనుడని ఆయన తెలుసుకున్నాడు. తమ పత్రికలో మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించసాగారు. నీతిమాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాలపై కూడా బురద జల్లడానికి సమకట్టారు.

ఆ రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం... ఆరుునా ఆపలేదు. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రసాదించింది దుర్వినియోగం చేయడానికేనని వారు భావించినప్పుడు, అందుకు అనుగుణంగానే వ్యవహరించడానికి నిర్ణరుుంచుకున్నప్పుడు ప్రజలే గుణపాఠం చెపుతారని వారికి చెప్పాం. మీరు రాసేది రాయండి... నేను చేసేది చేస్తాను అని చెప్పాను. ఆనాటినుండి ఆయన మా మీద పగ పెంచుకున్నాడు. మా మీద, ఆమె (లక్ష్మీపార్వతి) మీద అవాకులు చెవాకులు రారుుస్తున్నాడు. కొందరి ఆలోచనా ధోరణినే తప్పు పట్టించడానికి అనునిత్యం ఒక అసత్య ప్రచారాన్ని పుట్టిస్తున్నాడు. తన పత్రికని అబద్ధాల పుట్టగా, చెత్త కాగితాల బుట్టగా మార్చేస్తున్నాడు.

No comments: