త్రీ
ఈడియట్స్ తెలుగు వెర్షన్ కు మహేష్ ను హీరోగా అనుకుంటున్నారంటూ మొదట నుంచి
వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో రకరకాల మార్పులు జరిగి
సూర్య లైన్ లోకి వచ్చారు. అయితే రెమ్యునేషన్ చాలక సూర్య సీన్ లోంచి
తప్పుకోవటంతో మళ్ళీ తమిళ వెర్షన్ కి విజయ్ ని ఒప్పించి పట్టాలు ఎక్కించి
షూటింగ్ మొదలెట్టారు. ఇప్పుడు మహేష్ ను కూడా ఒప్పించారు. దాంతో మహేష్ తో
అతి తక్కువ డేట్స్ తో తెలుగు వెర్షన్ లాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా రోబోతో మరోసారి స్టార్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శంకర్ ఈ
చిత్రానికి దర్శకత్వం వహిస్తూండటంతో ఎన్ని మార్పుల జరిగినా మహేష్ ఓకే
అన్నారు. ఇక మొదటి నుంచీ ఈ ప్రాజెక్టులో ఉన్న గోవా సుందరి ఇలియానా కంటిన్యూ
అయి తెలుగు, తమిళ భాషల్లో సినిమాను చేస్తోంది. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో
నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్ఖాన్ పాత్రకు తమిళంలో విజయ్ను,తెలుగుకు
మహేష్ ను, ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్లను ఎంపిక చేసారు. మరో కీలక
పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి తమిళంలో ‘మువ్వర్’,
తెలుగులో ‘త్రీ రాస్కెల్స్’ పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్
ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది.
Oct 4, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment