వై
యస్ జగన్ మోహన్ రెడ్డి తో ఆర్ధిక వ్యవహారాలు ఏర్పాటు చేసుకున్న మంత్రులు,
యం పి ల ను సహితం అరెస్ట్ చేయడానికి సి బి ఐ రంగం సిద్దం చేస్తున్నట్లు
తెలుస్తున్నది. హవాల పద్దతిలో జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సంస్థలకు నిధులు
సమకూర్చడంలో తమ వంతు పాత్ర వహించిన వారి వివరాలను సి బి ఐ సేకరిస్తున్నట్లు
విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జగన్ మోహన్ రెడ్డి నుండి ప్రయోజనం
పొందినందుకు ప్రతిఫలం గానో, అయన నుండి తీసుకున్న నిధులలో బినామీ కంపెనీల
ద్వారా, విదేశాల ద్వారా జగన్ వ్యాపార సంస్థలలో పెట్టుబడులుగా డిపాజిట్
చేయడంలో కీలక పాత్ర వహించిన వారి వివరాలను సి బి ఐ సేకరిస్తున్నట్లు
తెలుస్తున్నది.
ఇటీవల ఒక ఎం పి, మరో మంత్రి విదేశి పర్యటనకు వెళ్ళడం వెనుక సి బి ఐ
దర్యాప్తు నుండి తప్పించుకొనే విధంగా తమ ఆర్ధిక వ్యవహారాలను చక్క దిద్దు
కోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమే అని పలువురు భావిస్తున్నారు. అందిన
సమాచారం మేరకు కనీసం తెలంగాణా ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులు,
కోస్తా ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎం. పి లు హవాల లావాదేవీలతో జగన్
మోహన్ రెడ్డి కి సహకరించి నట్లు ఆధారాలను సి బి ఐ సేకరించినట్లు
తెలుస్తున్నది. మరో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.

జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్, రాష్ట్ర
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాబ్ నబి ఆజాద్, సోనియా గాంధీ రాజకీయ
సలహాదారుడు అహ్మద్ పటేల్ తదితరులు సానుకూలంగా ఉన్నా సోనియా గాంధీ మాత్రం
కఠిన వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తున్నది. దానితో జగన్ మోహన్ రెడ్డి
వర్గం రాజీ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి ఆమెపై వతిడి తేవాలని, రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తీసుకు రావాలని ప్రయత్నాలు
చేపట్టారు. టి ఆర్ యస్ అధినేత కె చంద్రశేఖర్ రావు తో అంగీకారానికి వచ్చి
ప్రజా ప్రతినిధులను రాజీనామాలకు ప్రోత్సహించడం ప్రారంభించారు. జగన్ మోహన్
రెడ్డి వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలు ఈ ఎతుగడ లో భాగమే అని
తెలుస్తున్నది.
పైగా తెలంగాణా ప్రాంత మంత్రుల రాజీనామాల ద్వారా సోనియా గాంధీ పై మరింత వతిడి పెంచాలని భావించి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేత రాజీనామా చేయించారు. అయన మార్గంలో మరో ఐదారుగురు మంత్రులు రాజీనామా చేయగలరని ముందుగా భావించిన మరెవ్వరు ముందుకు రాక పోవడంతో జగన్మోహన్ రెడ్డి వర్గం ఖంగు తిన్నది. ప్రభుత్వం పడిపోయే పరిస్తితు ఏర్పడితే రాష్ట్ర పాటి పాలన విధించడానికి అయినా సిద్దమే గాని రాజీకి సిద్దం కాదని సోనియా గాంధీ స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. రాష్ట్ర గవర్నెర్ నరసింహన్ ను ఢిల్లీ కి పిలిపించి రాష్ట్ర వ్యవహారాలపై చర్చలు జరపడం రాష్ట్రపతి పాలనకు రంగం సిద్దం చేయడంలో భాగమే అని స్పష్టం అవుతున్నది.
పైగా తెలంగాణా ప్రాంత మంత్రుల రాజీనామాల ద్వారా సోనియా గాంధీ పై మరింత వతిడి పెంచాలని భావించి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేత రాజీనామా చేయించారు. అయన మార్గంలో మరో ఐదారుగురు మంత్రులు రాజీనామా చేయగలరని ముందుగా భావించిన మరెవ్వరు ముందుకు రాక పోవడంతో జగన్మోహన్ రెడ్డి వర్గం ఖంగు తిన్నది. ప్రభుత్వం పడిపోయే పరిస్తితు ఏర్పడితే రాష్ట్ర పాటి పాలన విధించడానికి అయినా సిద్దమే గాని రాజీకి సిద్దం కాదని సోనియా గాంధీ స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. రాష్ట్ర గవర్నెర్ నరసింహన్ ను ఢిల్లీ కి పిలిపించి రాష్ట్ర వ్యవహారాలపై చర్చలు జరపడం రాష్ట్రపతి పాలనకు రంగం సిద్దం చేయడంలో భాగమే అని స్పష్టం అవుతున్నది.
మరో వంక తెలంగాణా రాష్ట్రం
ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖేర్జీ చేత ప్రకటన
చేయించడం ద్వారా అటు కె సి ఆర్ కు, ఇటు జగన్ మోహన్ రెడ్డి కి కేంద్రం కఠిన
వైఖరి అవలంభిస్తున్నట్లు స్నాకేతం ఇచి నట్లయినది. దానితో ఖంగారు పడిన కె
చంద్ర శేఖర్ రావు మరో మారు ఢిల్లీ పర్యటనకు హడావుడిగా బయలు దేరు తున్నారు.
ఏదో వొక సానుకూల ప్రకటన చేసి తమ సమ్మె విరమణకు మార్గం ఏర్పాటు చేయమని
కేంద్ర నాయకులను అయన అర్ధిస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నందున అప్పటి లోగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా అయినా మరే అవకాశం ఉన్నదనే ధీమాతో ప్రస్తుత బెదిరుమ్పులకు లొంగ రాదని సోనియా గాంధీ కేంద్ర నాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసినది. రాష్ట్ర పాటి పాలన విధించడం ద్వారా పరిస్థితులను అదుపు లోకి తీసుకోవచ్చనే ధీమాతో ఉన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నందున అప్పటి లోగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా అయినా మరే అవకాశం ఉన్నదనే ధీమాతో ప్రస్తుత బెదిరుమ్పులకు లొంగ రాదని సోనియా గాంధీ కేంద్ర నాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసినది. రాష్ట్ర పాటి పాలన విధించడం ద్వారా పరిస్థితులను అదుపు లోకి తీసుకోవచ్చనే ధీమాతో ఉన్నారు.
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి - :: నేటి ప్రపంచం ::
No comments:
Post a Comment