పపంచం మెచ్చిన యాక్షన్ హీరో-జాకీచాన్. యాక్షన్కి తనదైన ఎంటర్టైన్మెంట్ని జోడించి వెండితెరపై ఓ కొత్త పంథా సృష్టించారాయన. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్న జాకీచాన్ త్వరలో సెంచరీ కొట్టబోతున్నారు. అంటే వంద సినిమాలు పూర్తి చేసుకోబోతున్నారన్నమాట. ఆ సినిమా పేరు ‘1911’. దానికి దర్శకుడూ, నిర్మాతా ఆయనే కావడం విశేషం.
వందేళ్ల క్రితం రిపబ్లిక్ చైనా కోసం జరిగిన ‘జిన్నా రివాల్యూషన్’ నేపథ్యంలో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టూడియో ఎన్, 3 కె ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై అమర్, వి.గిరీష్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అమర్, గిరీష్ మాట్లాడుతూ -‘‘ప్రాంతాలకు, భాషలకు సంబంధం లేని హీరో.
ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. తన వందో సినిమాను పర్పస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో చైనాకు చెందిన జిన్నా పోరాటాన్ని కథాంశంగా ఎంచుకున్నారు. అప్పటి సంఘటనల్ని చాలా సహజంగా తెరకెక్కించారు. జాకీచాన్తో పాటు ఆయన కొడుకు జాసిచాన్ కూడా ఇందులో నటించడం విశేషం’’ అని తెలిపారు. |
|
No comments:
Post a Comment