
ఉత్పత్తి సామర్ధ్యాన్ని రోజుకు నాలుగు నుండి ఎనిమిది కోట్ల ప్రామాణిక శతకోటి అడుగుల స్థాయికి (ఎంఎస్సిఎఫ్డి) పెంచినందునే పెట్టుబడి వ్యయం పెరిగిన విషయాన్ని కాగ్ పరిగణనలోకి తీసుకోలేదనేది వినవచ్చిన ఒక ప్రతి స్పందన. రోజుకు నాలుగు కోట్ల శతకోటి ఘనపు టడుగుల చొప్పున ఐదు ట్రిలియన్ శతకోటి ఘనపుటడుగుల (టిసిఎఫ్) గ్యాస్ను వెలికితీసేందుకు ప్రభుత్వం తొలుత రు. 247 కోట్ల డాలర్ల ఉత్పత్తి వ్యయాన్ని ఆమోదించింది. రోజుకు ఎనిమిది శతకోటి ఘనపుటడుగుల చొప్పున పది టిసిఎఫ్ గ్యాస్ను వెలికితీసేందుకు గాను ఉత్పత్తి వ్యయాన్ని 880 కోట్ల డాలర్లకు పెంచింది. ఉత్పత్తి సామర్ధ్యం రెండు రెట్లు పెరగ్గా వ్యయం 3.5 రెట్లు పెరిగింది.
కృష్ణా గోదావరి బేసిన్(కెజి బేసిన్), ఇతర ప్రాంతాల్లో ముడిచమురు, సహజ వాయువు వెలికితీత కాంట్రాక్టు పేరుతో పట్టపగలు జరిగిన దోపిడీని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బట్టబయలు చేసింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ (ఎంపిఎన్జి), రిలయెన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్), కెయిర్న్ ఇండియా, బ్రిటిష్ గ్యాస్ అనే ముగ్గురు కాంట్రాక్టర్ల లావాదేవీలపై కాగ్ తన తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు పార్లమెంటుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశీలించి అవగాహన చేసుకునేందుకు ఈ కింది అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంపిఎన్జి తరఫున, కెజి బేసిన్ బ్లాక్లో వ్యయాన్ని ఆర్ఐఎల్ పెంచడానికి అనుకూలంగా వెలువడిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నాను.
కుంటి సమర్ధన
ఉత్పత్తి సామర్ధ్యాన్ని రోజుకు నాలుగు నుండి ఎనిమిది కోట్ల ప్రామాణిక శతకోటి అడుగుల స్థాయికి (ఎంఎస్సిఎఫ్డి) పెంచినందునే పెట్టుబడి వ్యయం పెరిగిన విషయాన్ని కాగ్ పరిగణనలోకి తీసుకోలేదనేది వినవచ్చిన ఒక ప్రతి స్పందన. రోజుకు నాలుగు కోట్ల శతకోటి ఘనపు టడుగుల చొప్పున ఐదు ట్రిలియన్ శతకోటి ఘనపుటడుగుల (టిసిఎఫ్) గ్యాస్ను వెలికితీసేందుకు ప్రభుత్వం తొలుత రు. 247 కోట్ల డాలర్ల ఉత్పత్తి వ్యయాన్ని ఆమోదించింది. రోజుకు ఎనిమిది శతకోటి ఘనపుటడుగుల చొప్పున పది టిసిఎఫ్ గ్యాస్ను వెలికితీసేందుకు గాను ఉత్పత్తి వ్యయాన్ని 880 కోట్ల డాలర్లకు పెంచింది. ఉత్పత్తి సామర్ధ్యం రెండు రెట్లు పెరగ్గా వ్యయం 3.5 రెట్లు పెరిగింది. వాస్తవ ఖర్చుకు, ఆమోదిత ఖర్చుకు ఎంతమాత్రం పొంతన లేదు. 'ఎకానమీ ఆఫ్ స్కేల్' సిద్ధాంతం అన్ని రంగాలకు వర్తించే నిరూపణ అయిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నుండి కెజి బ్లాక్లో ఆర్ఐఎల్కు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు. పెట్టుబడిలో ఆమోదయోగ్యం కాని రీతిలో వ్యయం పెంచడాన్ని 'గోల్డ్ప్లేటింగ్' అని పిలుస్తారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్, భారత ప్రభుత్వం మధ్య రహస్య సంబంధాన్ని, లాలూచీని కాగ్ బట్టబయలు చేసింది.
2009 మార్చి 31 వరకు బావుల అభివృద్ధి, తవ్వకాలకు అయిన వ్యయాలపై త్రైమాసిక నివేదికను ఎంపిఎన్జికి ఆర్ఐఎల్ సమర్పించింది. 2009 ఏప్రిల్ 1 నుండి జూన్ల్ 30 వరకు అయిన ఉత్పత్తి వ్యయాన్ని కూడా ఈ నివేదిక వివరించింది. కేజి బేసిన్లో సహజ వాయువు ఉత్పత్తి 2009 ఏప్రిల్లో, ముడి చమురు ఉత్పత్తి 2009 జూన్లో ప్రారంభమయ్యాయి. ఈ లెక్కలను నాల్గవ త్రైమాసికాంతానికి, అంటే 2010 మార్చి 31కి విస్తరింపజేస్తే తవ్వకాలు, బావుల అభివృద్ధి, ఉత్పత్తి వ్యయం 880 కోట్ల డాలర్ల కంటే తక్కువే అవుతుంది. అందువల్ల 880 కోట్ల డాలర్ల వ్యయం అనేది వట్టి బోగస్ అని అర్థమవుతోంది.
పెట్టుబడి వ్యయం పెంపు ప్రభావం ఖజానాపై ఉండబోదని మంత్రిత్వ శాఖ బుకాయించింది. ఇది అర్ధ సత్యం మాత్రమే. భారత ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెరగలేదన్న మాట వాస్తవమే. అందువల్ల పెట్టుబడి వ్యయం పెరిగిన ప్రభావం నేరుగా ఖజానాపై ఎటువంటి భారాన్ని మోపబోదు. అయితే పూర్తి నిజం ఏమిటంటే, పెట్టుబడి వ్యయం పెరిగితే గ్యాస్ ఉత్పత్తి వల్ల చేకూరే లాభాల్లో ప్రభుత్వ వాటా తగ్గుతుంది. పెట్టుబడి వ్యయం ఎంతగా పెరిగితే ప్రభుత్వ వాటా ఆమేరకు తగ్గుతుంది. అందువల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. వినియోగదారుల జేబులకు చిల్లులు పడటం వల్లే ఆర్ఐఎల్ లాభాలు పెరుగుతాయి. పెట్టుబడి వ్యయాన్ని మోసపూరితంగా ఒక వంద కోట్ల డాలర్లు పెంచితే ఆర్ఐఎల్కు కనీసం 150 కోట్ల డాలర్ల లాభం వస్తుందని అంచనా. పార్లమెంటుకు నివేదిక సమర్పించడానికి ముందుగానే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారులు సభాహక్కులను ఉల్లంఘించారా అనే విషయాన్ని పార్లమెంటు ఈ సందర్భంగా పరిశీలించాలి.
ప్రభుత్వానికి అనుకూలం కాని నిబంధనలు
బ్లాక్ల కేటాయింపులో కొంతమేరకు పోటీతో కూడిన బిడ్డింగ్లను నిర్వహించారు. ఆర్ఐఎల్ కెజి-డిి6 బ్లాక్ను బిడ్డింగ్ ద్వారా పొందింది. అయితే సహజవాయువు వినియోగానికి సంబంధించి ప్రతి దశలోనూ లాభాల్లో భారత ప్రభుత్వ వాటా కంటే ఆర్ఐఎల్ వాటానే ఎక్కువ. మొదటి దశలో ప్రభుత్వ వాటా పది శాతం మాత్రమే. చివరి దశకు ఇది 85 శాతానికి పెరుగుతుంది. ముడి చమురు, సహజ వాయువు రిజర్వ్ల అనిశ్చితి కారణంగా లాభంలో 85 శాతం వాటా పొందే అవకాశం పభుత్వానికి ఎన్నటికీ కలగకపోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నా ఆర్ఐఎల్ సంచిత లాభం భారత ప్రభుత్వానికి కంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం ఆర్ఐఎల్ మధ్య లాభాల పంపిణీ ఒప్పందం అటువంటి 220 ఒప్పందాల్లో ఒకటి మాత్రమే. ఈ నేపథ్యంలో అనేక బ్లాక్లను ఈ విధంగా ప్రభుత్వానికి సానుకూలం కాని రీతిలో అప్పగించినట్లు భావించాల్సి వస్తుంది. భారత ప్రభుత్వానికి లభించే వాటా సానుకూలం కాని నిబంధనల వల్ల సంపద కొంత మంది కాంట్రాక్టర్ల చేతుల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది మన రాజ్యాంగంలోని 39(బి, సి) ప్రకరణాల స్పూర్తికి విరుద్ధం. ఒక కాంట్రాక్టు వల్లనే 10 కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లితే అటువంటి 220 కాంట్రాక్టుల వల్ల ఒనగూరే నష్టం లక్షలాది కోట్ల డాలర్లకు చేరుకుంటుంది.
ఇటువంటి కాంట్రాక్టులకు అవకాశం కల్పించే కొత్త తవ్వకాలు, లైసెన్స్ విధానం (ఎన్ఇఎల్పి) ప్రయివేటు సంస్థలకు మన దేశ సహజ వనరులను దోచిపెట్టి అక్రమ లాభాలు కట్టబెట్టేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. దీనిపై తక్షణం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇతర రంగాల్లో సమర్థవంతంగా అమలు జరుగుతున్న అనుశాసనిక కాస్ట్ ప్లస్ విధానం నుండి ఎన్ఇఎల్పి పక్కకు మళ్లాల్సిన అవసరం లేదు.
ఈ అంశానికి మరో కోణం కూడా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు, అంటే అంతర్జాతీయ వనరులకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ ధరలను ఇవ్వడం జరుగుతుంది. అలాకాకుండా దేశవాళీ, లేదా జాతీయ వనరులను ఉపయోగించే సందర్భాల్లో అంతర్జాతీయ వనరులను ఉత్పత్తిదారులకు దోచిపెట్టడం అనుచితం. ఉత్పత్తిని పంచుకునే ఒప్పందాల్లో అంతర్జాతీయ ధరల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
అనుచిత ధరలు
ఉత్పత్తి అయిన గ్యాస్కు సరైన ధరను అంచనా వేసేందుకు రుణాన్ని సమాన నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే విధానాన్ని (ఇఎంఐ) అనుసరించడం మంచిది. మొత్తం పెట్టుబడి వ్యయాన్ని రుణంగా పరిగణించి ఎనిమిది శాతం వడ్డీ రేటుతో పది సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించినట్లు పరిగణించి కెజి డి6 బ్లాక్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరను అంచనా వేయవచ్చు. ఆపరేషన్ వ్యయాన్ని 2.5 శాతంగా నిర్ణయించవచ్చు.
పెట్టుబడి వ్యయం పెరిగినప్పటికీ గ్యాస్ ధర 247 వందల కోట్ల డాలర్ల (పది లక్షల బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు-ఎంఎంబిటియు) ఉండవచ్చు. అందువల్ల ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల ధరను నిర్ణయించడం సముచితం కాగలదు. గ్యాస్ ధరను ఇంత ఎక్కువగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుండి ఎటువంటి వివరణ లేదు. ప్రభుత్వం నిర్ణయించిన గ్యాస్ ధరను పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని ఇందువల్ల స్పష్టమవుతోంది. గ్యాస్ ఉత్పత్తి వ్యయం, కాంట్రాక్టరుకు సముచితమైన లాభం వచ్చేలా ధర నిర్ణయం జరగాలి.
లాభాల్లో ఆర్ఐఎల్కు, ప్రభుత్వానికి సంవత్సరం వారీగా లభించే వాటాలకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తే ఉత్పత్తి వ్యయం పెంచడం వల్ల ఆర్ఐఎల్ లాభాలు తగ్గుతాయనే అభిప్రాయం కలిగినప్పటికీ వాస్తవానికి ఆర్ఐఎల్ వాటా పెరుగుతుండగా ప్రభుత్వం వాటా తగ్గుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఆర్ఐఎల్, ప్రభుత్వ వాటాల్లో గ్యాస్ ధర ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఐదు శాతం రాయల్టీ చెల్లిస్తే ఉత్పత్తి వ్యయం సంవత్సరానికి 23 కోట్ల డాలర్లకు చేరుకుంటుంది.
ఉత్పత్తి పంపిణీ ఒప్పందాన్ని పునస్స మీక్షించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. మన సహజ వనరులకు అంతర్జాతీయంగా మార్కెట్ ధరల ప్రాతిపదికగా కాంట్రాక్లర్లకు చెల్లించే విధానం వల్ల ఉత్పత్తిదారు లేదా కాంట్రాక్టరు లాభం అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడల్లా పెరుగుతుంది. ఈ విధానం స్థానంలో నిర్దిష్ట ధరల యంత్రాంగాన్ని (ఎపిఎం) ప్రవేశపెట్టాలి. కాంట్రాక్టరుకు సముచితమైన లాభం లభించేలా సేకరణ ధరను నిర్ణయించాలి.
పునరుత్పత్తికి సాధ్యం కాని మొత్తం వనరులను వినియోగించే అవకాశం ఒక్క తరం వారికే కేటాయించకూడదు. భవిష్యత్ తరాల వారు అందులో వాటా కోరే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. జాతీయ వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించాలి. ఎ రాజా మాదిరిగా అప్పటివరకు అమలులో ఉన్న విధానాన్నే తాను అనుసరించానని పేర్కొనడం వల్ల ఉపయోగం ఉండబోదు. గతంలో జరిగిన పొరపాట్లను సైతం సరిచేసే విధంగా ప్రభుత్వం జాతీయ వనరులను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇనుప ఖనిజం, బాక్సైట్, మాంగనీస్ ఖనిజం, క్రోమియం మొదలైన ఖనిజాల విషయంలో నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి. అందుబాటులో ఉన్న వనరులు రానున్న వంద సంవత్సరాలకు దేశ అవసరాలను తీర్చబోదని భావిస్తే ఎగుమతులను తక్షణం నిలిపివేయాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని దీనిని నిర్ణయించాలి. దేశ ఆర్థిక ప్రణాళికను స్పష్టంగా నిర్ణయించుకునేవరకు తవ్వకాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అయితే త్పత్తి పంచుకునే ఒప్పందాలు నిర్దేశించినా ఈ వనరులను తవ్వితీసే విషయంలో మితిమీరిన తొందరపాటుతనం పనికిరాదు. కాంట్రాక్టర్ల నుండి ముడుపులు ఆశించి అందుబాటులో ఉన్న వనరులను వేగంగా వినియోగించడం జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించే ఉత్పత్తులను పంచుకునే ఒప్పందాలన్నిటినీ రద్దు చేయడం తక్షణ అవసరం. ఈ పట్టపగలు దోపిడీని ఆపాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులపై ఉంది.
కృష్ణా గోదావరి బేసిన్(కెజి బేసిన్), ఇతర ప్రాంతాల్లో ముడిచమురు, సహజ వాయువు వెలికితీత కాంట్రాక్టు పేరుతో పట్టపగలు జరిగిన దోపిడీని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బట్టబయలు చేసింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ (ఎంపిఎన్జి), రిలయెన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్), కెయిర్న్ ఇండియా, బ్రిటిష్ గ్యాస్ అనే ముగ్గురు కాంట్రాక్టర్ల లావాదేవీలపై కాగ్ తన తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు పార్లమెంటుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశీలించి అవగాహన చేసుకునేందుకు ఈ కింది అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంపిఎన్జి తరఫున, కెజి బేసిన్ బ్లాక్లో వ్యయాన్ని ఆర్ఐఎల్ పెంచడానికి అనుకూలంగా వెలువడిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నాను.
కుంటి సమర్ధన
ఉత్పత్తి సామర్ధ్యాన్ని రోజుకు నాలుగు నుండి ఎనిమిది కోట్ల ప్రామాణిక శతకోటి అడుగుల స్థాయికి (ఎంఎస్సిఎఫ్డి) పెంచినందునే పెట్టుబడి వ్యయం పెరిగిన విషయాన్ని కాగ్ పరిగణనలోకి తీసుకోలేదనేది వినవచ్చిన ఒక ప్రతి స్పందన. రోజుకు నాలుగు కోట్ల శతకోటి ఘనపు టడుగుల చొప్పున ఐదు ట్రిలియన్ శతకోటి ఘనపుటడుగుల (టిసిఎఫ్) గ్యాస్ను వెలికితీసేందుకు ప్రభుత్వం తొలుత రు. 247 కోట్ల డాలర్ల ఉత్పత్తి వ్యయాన్ని ఆమోదించింది. రోజుకు ఎనిమిది శతకోటి ఘనపుటడుగుల చొప్పున పది టిసిఎఫ్ గ్యాస్ను వెలికితీసేందుకు గాను ఉత్పత్తి వ్యయాన్ని 880 కోట్ల డాలర్లకు పెంచింది. ఉత్పత్తి సామర్ధ్యం రెండు రెట్లు పెరగ్గా వ్యయం 3.5 రెట్లు పెరిగింది. వాస్తవ ఖర్చుకు, ఆమోదిత ఖర్చుకు ఎంతమాత్రం పొంతన లేదు. 'ఎకానమీ ఆఫ్ స్కేల్' సిద్ధాంతం అన్ని రంగాలకు వర్తించే నిరూపణ అయిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నుండి కెజి బ్లాక్లో ఆర్ఐఎల్కు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు. పెట్టుబడిలో ఆమోదయోగ్యం కాని రీతిలో వ్యయం పెంచడాన్ని 'గోల్డ్ప్లేటింగ్' అని పిలుస్తారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్, భారత ప్రభుత్వం మధ్య రహస్య సంబంధాన్ని, లాలూచీని కాగ్ బట్టబయలు చేసింది.
2009 మార్చి 31 వరకు బావుల అభివృద్ధి, తవ్వకాలకు అయిన వ్యయాలపై త్రైమాసిక నివేదికను ఎంపిఎన్జికి ఆర్ఐఎల్ సమర్పించింది. 2009 ఏప్రిల్ 1 నుండి జూన్ల్ 30 వరకు అయిన ఉత్పత్తి వ్యయాన్ని కూడా ఈ నివేదిక వివరించింది. కేజి బేసిన్లో సహజ వాయువు ఉత్పత్తి 2009 ఏప్రిల్లో, ముడి చమురు ఉత్పత్తి 2009 జూన్లో ప్రారంభమయ్యాయి. ఈ లెక్కలను నాల్గవ త్రైమాసికాంతానికి, అంటే 2010 మార్చి 31కి విస్తరింపజేస్తే తవ్వకాలు, బావుల అభివృద్ధి, ఉత్పత్తి వ్యయం 880 కోట్ల డాలర్ల కంటే తక్కువే అవుతుంది. అందువల్ల 880 కోట్ల డాలర్ల వ్యయం అనేది వట్టి బోగస్ అని అర్థమవుతోంది.
పెట్టుబడి వ్యయం పెంపు ప్రభావం ఖజానాపై ఉండబోదని మంత్రిత్వ శాఖ బుకాయించింది. ఇది అర్ధ సత్యం మాత్రమే. భారత ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెరగలేదన్న మాట వాస్తవమే. అందువల్ల పెట్టుబడి వ్యయం పెరిగిన ప్రభావం నేరుగా ఖజానాపై ఎటువంటి భారాన్ని మోపబోదు. అయితే పూర్తి నిజం ఏమిటంటే, పెట్టుబడి వ్యయం పెరిగితే గ్యాస్ ఉత్పత్తి వల్ల చేకూరే లాభాల్లో ప్రభుత్వ వాటా తగ్గుతుంది. పెట్టుబడి వ్యయం ఎంతగా పెరిగితే ప్రభుత్వ వాటా ఆమేరకు తగ్గుతుంది. అందువల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. వినియోగదారుల జేబులకు చిల్లులు పడటం వల్లే ఆర్ఐఎల్ లాభాలు పెరుగుతాయి. పెట్టుబడి వ్యయాన్ని మోసపూరితంగా ఒక వంద కోట్ల డాలర్లు పెంచితే ఆర్ఐఎల్కు కనీసం 150 కోట్ల డాలర్ల లాభం వస్తుందని అంచనా. పార్లమెంటుకు నివేదిక సమర్పించడానికి ముందుగానే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారులు సభాహక్కులను ఉల్లంఘించారా అనే విషయాన్ని పార్లమెంటు ఈ సందర్భంగా పరిశీలించాలి.
ప్రభుత్వానికి అనుకూలం కాని నిబంధనలు
బ్లాక్ల కేటాయింపులో కొంతమేరకు పోటీతో కూడిన బిడ్డింగ్లను నిర్వహించారు. ఆర్ఐఎల్ కెజి-డిి6 బ్లాక్ను బిడ్డింగ్ ద్వారా పొందింది. అయితే సహజవాయువు వినియోగానికి సంబంధించి ప్రతి దశలోనూ లాభాల్లో భారత ప్రభుత్వ వాటా కంటే ఆర్ఐఎల్ వాటానే ఎక్కువ. మొదటి దశలో ప్రభుత్వ వాటా పది శాతం మాత్రమే. చివరి దశకు ఇది 85 శాతానికి పెరుగుతుంది. ముడి చమురు, సహజ వాయువు రిజర్వ్ల అనిశ్చితి కారణంగా లాభంలో 85 శాతం వాటా పొందే అవకాశం పభుత్వానికి ఎన్నటికీ కలగకపోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నా ఆర్ఐఎల్ సంచిత లాభం భారత ప్రభుత్వానికి కంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం ఆర్ఐఎల్ మధ్య లాభాల పంపిణీ ఒప్పందం అటువంటి 220 ఒప్పందాల్లో ఒకటి మాత్రమే. ఈ నేపథ్యంలో అనేక బ్లాక్లను ఈ విధంగా ప్రభుత్వానికి సానుకూలం కాని రీతిలో అప్పగించినట్లు భావించాల్సి వస్తుంది. భారత ప్రభుత్వానికి లభించే వాటా సానుకూలం కాని నిబంధనల వల్ల సంపద కొంత మంది కాంట్రాక్టర్ల చేతుల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది మన రాజ్యాంగంలోని 39(బి, సి) ప్రకరణాల స్పూర్తికి విరుద్ధం. ఒక కాంట్రాక్టు వల్లనే 10 కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లితే అటువంటి 220 కాంట్రాక్టుల వల్ల ఒనగూరే నష్టం లక్షలాది కోట్ల డాలర్లకు చేరుకుంటుంది.
ఇటువంటి కాంట్రాక్టులకు అవకాశం కల్పించే కొత్త తవ్వకాలు, లైసెన్స్ విధానం (ఎన్ఇఎల్పి) ప్రయివేటు సంస్థలకు మన దేశ సహజ వనరులను దోచిపెట్టి అక్రమ లాభాలు కట్టబెట్టేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. దీనిపై తక్షణం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇతర రంగాల్లో సమర్థవంతంగా అమలు జరుగుతున్న అనుశాసనిక కాస్ట్ ప్లస్ విధానం నుండి ఎన్ఇఎల్పి పక్కకు మళ్లాల్సిన అవసరం లేదు.
ఈ అంశానికి మరో కోణం కూడా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు, అంటే అంతర్జాతీయ వనరులకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ ధరలను ఇవ్వడం జరుగుతుంది. అలాకాకుండా దేశవాళీ, లేదా జాతీయ వనరులను ఉపయోగించే సందర్భాల్లో అంతర్జాతీయ వనరులను ఉత్పత్తిదారులకు దోచిపెట్టడం అనుచితం. ఉత్పత్తిని పంచుకునే ఒప్పందాల్లో అంతర్జాతీయ ధరల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
అనుచిత ధరలు
ఉత్పత్తి అయిన గ్యాస్కు సరైన ధరను అంచనా వేసేందుకు రుణాన్ని సమాన నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే విధానాన్ని (ఇఎంఐ) అనుసరించడం మంచిది. మొత్తం పెట్టుబడి వ్యయాన్ని రుణంగా పరిగణించి ఎనిమిది శాతం వడ్డీ రేటుతో పది సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించినట్లు పరిగణించి కెజి డి6 బ్లాక్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరను అంచనా వేయవచ్చు. ఆపరేషన్ వ్యయాన్ని 2.5 శాతంగా నిర్ణయించవచ్చు.
పెట్టుబడి వ్యయం పెరిగినప్పటికీ గ్యాస్ ధర 247 వందల కోట్ల డాలర్ల (పది లక్షల బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు-ఎంఎంబిటియు) ఉండవచ్చు. అందువల్ల ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల ధరను నిర్ణయించడం సముచితం కాగలదు. గ్యాస్ ధరను ఇంత ఎక్కువగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుండి ఎటువంటి వివరణ లేదు. ప్రభుత్వం నిర్ణయించిన గ్యాస్ ధరను పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని ఇందువల్ల స్పష్టమవుతోంది. గ్యాస్ ఉత్పత్తి వ్యయం, కాంట్రాక్టరుకు సముచితమైన లాభం వచ్చేలా ధర నిర్ణయం జరగాలి.
లాభాల్లో ఆర్ఐఎల్కు, ప్రభుత్వానికి సంవత్సరం వారీగా లభించే వాటాలకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తే ఉత్పత్తి వ్యయం పెంచడం వల్ల ఆర్ఐఎల్ లాభాలు తగ్గుతాయనే అభిప్రాయం కలిగినప్పటికీ వాస్తవానికి ఆర్ఐఎల్ వాటా పెరుగుతుండగా ప్రభుత్వం వాటా తగ్గుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఆర్ఐఎల్, ప్రభుత్వ వాటాల్లో గ్యాస్ ధర ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఐదు శాతం రాయల్టీ చెల్లిస్తే ఉత్పత్తి వ్యయం సంవత్సరానికి 23 కోట్ల డాలర్లకు చేరుకుంటుంది.
ఉత్పత్తి పంపిణీ ఒప్పందాన్ని పునస్స మీక్షించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. మన సహజ వనరులకు అంతర్జాతీయంగా మార్కెట్ ధరల ప్రాతిపదికగా కాంట్రాక్లర్లకు చెల్లించే విధానం వల్ల ఉత్పత్తిదారు లేదా కాంట్రాక్టరు లాభం అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడల్లా పెరుగుతుంది. ఈ విధానం స్థానంలో నిర్దిష్ట ధరల యంత్రాంగాన్ని (ఎపిఎం) ప్రవేశపెట్టాలి. కాంట్రాక్టరుకు సముచితమైన లాభం లభించేలా సేకరణ ధరను నిర్ణయించాలి.
పునరుత్పత్తికి సాధ్యం కాని మొత్తం వనరులను వినియోగించే అవకాశం ఒక్క తరం వారికే కేటాయించకూడదు. భవిష్యత్ తరాల వారు అందులో వాటా కోరే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. జాతీయ వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించాలి. ఎ రాజా మాదిరిగా అప్పటివరకు అమలులో ఉన్న విధానాన్నే తాను అనుసరించానని పేర్కొనడం వల్ల ఉపయోగం ఉండబోదు. గతంలో జరిగిన పొరపాట్లను సైతం సరిచేసే విధంగా ప్రభుత్వం జాతీయ వనరులను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇనుప ఖనిజం, బాక్సైట్, మాంగనీస్ ఖనిజం, క్రోమియం మొదలైన ఖనిజాల విషయంలో నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి. అందుబాటులో ఉన్న వనరులు రానున్న వంద సంవత్సరాలకు దేశ అవసరాలను తీర్చబోదని భావిస్తే ఎగుమతులను తక్షణం నిలిపివేయాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని దీనిని నిర్ణయించాలి. దేశ ఆర్థిక ప్రణాళికను స్పష్టంగా నిర్ణయించుకునేవరకు తవ్వకాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అయితే త్పత్తి పంచుకునే ఒప్పందాలు నిర్దేశించినా ఈ వనరులను తవ్వితీసే విషయంలో మితిమీరిన తొందరపాటుతనం పనికిరాదు. కాంట్రాక్టర్ల నుండి ముడుపులు ఆశించి అందుబాటులో ఉన్న వనరులను వేగంగా వినియోగించడం జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించే ఉత్పత్తులను పంచుకునే ఒప్పందాలన్నిటినీ రద్దు చేయడం తక్షణ అవసరం. ఈ పట్టపగలు దోపిడీని ఆపాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులపై ఉంది.
No comments:
Post a Comment