Sep 14, 2011

ఖమ్మం జిల్లా ' న్యూజనరేషన్ ' రోశయ్య మృతి

ఖమ్మం టౌన్, న్యూస్‌లైన్ : ప్రముఖ విద్యావేత్త, న్యూజనరేషన్ విద్యాసంస్థల అధినేత చీకటి రోశయ్య(68) మంగళవారం మృతి చెందారు.

రోశయ్య ప్రస్థానం..

తల్లాడ మండలం అన్నారుగూడెంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన రోశయ్య బడి పంతులుగా జీవి తం ప్రారంభించి జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతి పొం దారు. వామపక్ష కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే ఆయ న 1976 ఎమర్జెన్సీలో జైలుకు కూడా వెళ్లారు. జిల్లా మ ద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1992లో ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూజనరేషన్ విద్యాసంస్థను స్థాపించిన రోశయ్య 1997 లో ప్రొ గ్రెసివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చే సి తక్కు వ ఖర్చుతో విద్య అందించారు. సీపీఎంలో కీలకపాత్ర పోషించారు. ఆయన భార్య నాగరత్నమ్మ, కుమారుడు వైద్యుడు భారవి ఖమ్మంలో జనతా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. రోశయ్య మరణవార్త తెలియగానే సీపీఎం నా యకులు తమ్మినేని వీరభద్రం ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహంపై పార్టీజెండా కప్పి నివాళులర్పించారు.

ప్రముఖుల నివాళి :

రోశయ్య మృతదేహాన్ని ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు, డాక్టర్ బాణోత్ చంద్రావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, రాజ్యసభ మాజీ సభ్యుడు వై.రాధాకృష్ణమూర్తి, సీపీఐ నా యకుడు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, అఫ్రోజ్‌సమీనా, మువ్వా శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, రెజొనెన్స్ కళాశాల కరస్పాండెంట్లు నాగేంద్రకుమార్, శ్రీధర్‌రావు, ఎక్స్‌లెంట్ కళాశాలల శేషగిరిరావు, సృజన్ కళాశాల కరస్పాండెంట్ వీరారెడ్డి, స్టడీ సర్కిల్ కళాశాల కరస్పాండెంట్ నర్సింహారావు, శ్రీచైతన్య కళాశాల కరస్పాండెంట్ శ్రీధర్, న్యూఇరా కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ఆర్‌జేసీ కళాశాలల అధినేత కృష్ణ, సంతాపం తెలుపగా సీపీఐరాష్ట్ర కార్యవర్గసభ్యుడు టీ వీ.చౌదరి, నాయకులు మేకల సంగయ్య, భాగం హేమంతరావు సంతా పం వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నా గేశ్వరరావు ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించారు. నామా తల్లి వరలక్ష్మి రోశ య్య మృతదేహాన్ని సందర్శించారు. ఆ మె వెంట టీడీపీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని బేబిస్వర్ణకుమారి, టీడీ పీ నాయకులు కర్నాటి కృ ష్ణ, వైద్యులు రాజేష్‌గార్గ్, బుగ్గవీటి నరసిం హారావు, శెట్టిపల్లి నాగేశ్వరరావు, శైల జ ఉన్నారు.

నేడు ప్రైవేటు కళాశాలల బంద్

రోశయ్య మృతికి సంతాపంగా బుధవారం ప్రైవేటు జూనియర్ కళాశాలలను బంద్‌చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags: New Generation Junior College, Roshaiah Died, New Generation Roshaiah , Cheekati Roshaiah New Generation Chairman Died, New Generation Chairman, New Generation Roshaiah Died, CPM, New Generation Junior College Kaviraj Nagar Khammam College Chairman Roshaiah Died 

No comments: