
ఐసిసి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆరో ర్యాంక్ దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో ధోనీ 79 సగటుతో 236 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. దాంతో తొమ్మిదో ర్యాంక్ నుంచి ఆరో ర్యాంక్కు ఎగబాకాడు. యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి తొమ్మిదో ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ అసిమ్ ఆమ్లాకు అగ్రస్థానంలో నిలిచాడు. సచిన్ (13), గంభీర్ (14), సెహ్వాగ్ (15) టాప్-20లో స్థానం దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్కు టాప్ ర్యాంక్ దక్కింది. టాప్ టెన్లో భారత బౌలర్లు ఒక్కరూ చోటు దక్కించుకోలేకపోయారు. హర్భజన్కు 13వ ర్యాంక్ దక్కింది.
టాప్-10 బ్యాట్స్మెన్ : 1. అసిమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), 2. డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా), 3.షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), 4. ట్రాట్ (ఇంగ్లండ్), 5. సంగక్కర (శ్రీలంక), 6. ధోనీ (భారత్), 7.మైఖెల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), 8.మైఖ్ హస్సీ (ఆస్ట్రేలియా), 9. విరాట్ కొహ్లీ (భారత్), 10. దిల్షన్ (శ్రీలంక).
టాప్-10 బౌలర్లు : 1.స్వాన్ (ఇంగ్లండ్), 2.వెట్టోరి (న్యూజిలాండ్), 3.జాన్సన్ (ఆస్ట్రేలియా), 4.స్టెయిన్ (దక్షిణాఫ్రికా), 5.మోర్కెల్ (దక్షిణాఫ్రికా), 6.బొలింగర్ (ఆస్ట్రేలియా), 7.అజ్మల్ (పాకిస్తాన్), 8.ప్రైస్ (వెస్టిండీస్), 9.సొత్సోబె (దక్షిణిఫ్రికా), 10.మలింగ (శ్రీలంక).భారత బౌలర్లు హర్భజన్ సింగ్ (13), జహీర్ ఖాన్ (25), అశ్విన్ (41) ర్యాంకులు దక్కించుకున్నారు.
No comments:
Post a Comment