శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపం ను వెండి , రాగి, కంచు తో తయారు చేస్తారు.దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించ కుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవిన్చుకోవాలి.అంటే మన కోరికే శడగోప్యము.మనకు శత్రువులైన కామ , క్రోధ , మోహ ,మద మాత్సర్యముల వంటి వాటినుండి దూరంగా ఉంటామని తలవంచి తలుచుకోవడమే దాని పరమార్థం. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
సైన్సు పరంగా శట గోపం తయారు చేసిన లోహ సమ్మేళనాలు మారియూ శరీరం లోని అయానుల ఆవేశం ద్వారా విద్యుదావేశం జ్వలించి కొత్త అనుభూతినిస్తుంది.
No comments:
Post a Comment