Pages

Nov 1, 2011

బాలకృష్ణ..శ్రీరామరాజ్యం..

ప్రపంచ సినీ చరిత్రలో బాపు మాత్రమే శ్రీరామరాజ్యం అద్భుతంగా తీయగలరు

- బాలకృష్ణ
  •  ‘‘తెలుగు చూడాలంటే బాపు... తెలుగు వినాలంటే రమణ. అందుకు నిదర్శనమే ఈ శ్రీరామరాజ్యం. 
  • ఈ రోజు రాముడిగా నన్ను చూశారు. రేపు ఈ రాముడు పలుకులు ఎలా ఉంటాయో వింటారు. ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు. 
  • ఆయన తప్ప ఈ కథను ఇంతబాగా తీయగలిగిన వారు లేరు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. 
  • సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘శ్రీరామరాజ్యం’ పాటల అభినందన కార్యక్రమంలో ఆయన పై విధంగా స్పందించారు. 
  • ఈ వేడుకలోనే బాలకృష్ణ శ్రీరాముడు గెటప్‌కి సంబంధించిన చిత్రాలను అక్కినేని నాగేశ్వరరావు, కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. 
  • ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఇటీవల ఓ వ్యక్తి ఓ పరభాషా దర్శకుడి గురించి గొప్పగా మాట్లాడుతూ మన తెలుగు దర్శకులను అవమాన పరిచాడు. 
  • అప్పుడే ఆ వ్యక్తికి జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరించాను. 
  • మనలో గొప్ప సినిమాలు తీసే వారు ఎందరో ఉన్నారు. ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి గొప్ప సినిమాలు తెలుగువారు తీసినవే. 
  • ప్రపంచ సినీ చరిత్రలో ‘శ్రీరామరాజ్యం’ లాంటి కావ్యాన్ని ఎవరూ తీయలేరు. అది బాపుకు మాత్రమే సాధ్యం.
  • ఇళయరాజా సంగీతం, జొన్నవిత్తుల సాహిత్యం, యలమంచిలి సాయిబాబు నిర్మాణ దక్షత ఈ చిత్రం ఓ కళాఖండంగా రూపుదిద్దుకోవడానికి కారణం అయ్యింది.
  • ‘శ్రీరామరాజ్యం’ సంచలనం సృష్టించడం ఖాయం’’ అన్నారు.
  • ‘‘ఈ సినిమాకు నిజమైన హీరోలు బాపు, ఇళయరాజా, యలమంచిలి సాయిబాబు. 
  • ఇలాంటి సినిమా తీయడం, దానికి రచన చేయడం, సాహిత్యాన్నందించడం, సంగీతాన్ని సమకూర్చడం, నిర్మించడం ఇలా ప్రతీదీ ఒక అగ్ని పరీక్షే. 
  • ఆ పరీక్షల్లో వారందరూ మొదటి తరగతిలో పాసయ్యారు. ఈ కథను దర్శకుడిగా బాపును ఎన్నుకొని యాభై శాతం విజయాన్ని అందుకున్నారు నిర్మాత సాయిబాబు. 
  • సంసృ్కతిని పాడుచేస్తున్న సినిమాలు వస్తున్న నేటి తరుణంలో ‘శ్రీరామరాజ్యం’ సినిమా ప్రేక్షకులకు ఒక చల్లని పిల్ల తెమ్మర లాంటిది’’ అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. 
  • రామాజ్ఞతోనే ఈ సినిమా తీశానని, బాపును కష్టపెట్టానని నేను అనుకోవడం లేదని, ఇంకా ఇలాంటి కళాఖండాలు ఆయన నుంచి రావాలని నిర్మాత సాయిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
  • ఇళయరాజా, డి.రామానాయుడు, కృష్ణంరాజు, శ్రీకాంత్, కోడిరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, బాలయ్య, బ్రహ్మానందం, గిరిబాబు, మురళీమోహన్, జొన్నవిత్తుల, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, సాగర్, బద్రీనారాయణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment