Pages

Nov 2, 2011

'సెవెన్త్‌సెన్స్‌'కు..అక్కడా...ఇక్కడా మంచి స్పందన

  •  తెలుగులో సూర్య నటించనున్నారు.
  • అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. 
  • ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తెలియజేశారు. మంగళవారంనాడు సూర్య 'సెవెన్త్‌సెన్స్‌' విజయోత్సవ సభకు హైదరాబాద్‌ వచ్చారు. 
  • ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బెల్లంకొండ సురేష్‌ వ్యాఖ్యానిస్తూ...'సెవెన్త్‌సెన్స్‌ అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ముందుకు సాగుతుంది. 
  • నైజాంలో నాలుగు రోజులకు రూ.6 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 12 కోట్లకు చేరింది. 
  • అద్భుతమైన నటుడు సూర్యతో ద్విబాషా చిత్రాన్ని నిర్మిస్తున్నా. 'రంగం' దర్శకుడు కె.వి. ఆనంద్‌ నేతృత్వం వహించనున్నారు' అని తెలిపారు. 
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక అతిథి శ్రీహరి మాట్లాడుతూ...'గతాన్ని గౌరవించాలన్నా, చెప్పాలన్నా ధైర్యం కావాలి. 
  • మురుగదాస్‌ అటువంటి ధైర్యంతో సెవెన్త్‌సెన్స్‌ తీశాడు. 
  • చిత్రాన్ని చూస్తున్నంతసేపూ ఎంతో థ్రిల్‌కు గురయ్యాను. 
  • గజనితో ఆయన అభిమానిగా మారాను. 
  • శృతిహాసన్‌ తన పరిధిమేరకు నటించింది' అని అన్నారు. 
  • సూర్య స్పందిస్తూ...'తమిళనాడులో మంచి రెస్సాన్స్‌ వచ్చింది. ఎంతోమంది నటులకు రాని అవకాశం నాకు దక్కింది. 
  • నటుడిగా తృప్తినిచ్చింది. బోదిధర్మపాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నా. 
  • భవిష్యత్‌ తరాలు బోదిధర్మ గురించి చెప్పుకొనేటప్పుడు ఈ చిత్రం తప్పకుండా వుంటుంది. 
  • నా కెరీర్‌లో టాప్‌-5లో ఈ చిత్రముంటుంది' అని అన్నారు.

No comments:

Post a Comment