Pages

Oct 3, 2011

రంగులు, హంగులతో యంగ్ టైగర్ - "ఊసరవెల్లి"



‘‘వక్కంతం వంశీ కథ చెబితే నాకు బాగా నచ్చుతుంది. తను ఈ కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. సురేందర్‌రెడ్డి ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. సూపర్ డూపర్ అవుతుంది’’ అని ‘ఊసరవెల్లి’ ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఎన్టీఆర్ అన్నారు.

ఊసరవెల్లిలో ఎన్ని రంగులు ఉన్నాయో ఈ చిత్రంలో అన్ని హంగులు ఉంటాయని రచయిత వక్కంతం వంశీ చెప్పారు. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.


ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినం డిస్క్ వేడుక జరపబోతున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.


సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. విజయ దశమి కానుకగా ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా నాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, అలీ, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటించారు. 

ఈ పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. - :: నేటి ప్రపంచం :: 

No comments:

Post a Comment