Sep 28, 2011

తెలంగాణా వ్యాప్తంగా ధర్నాలు , రాస్తారోకోలు..


టీఎన్జీవో అద్యక్షుడు స్వామిగౌడ్పై దాడికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా రాస్తారోకోలు జరుగుతున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు నిర్వహిస్తోంది. పలుచోట్ల రాస్తారోకోలు బుధవారం ఉద్రికత్తలకు దారి తీసింది. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, హైటెక్ సిటీ వద్ద హరీశ్రావు, సికింద్రాబాద్ తిరుమలగిరి వద్ద ఈటెల రాజేందర్, అబీడ్స్ చౌరస్తా వద్ద కోదండరామ్లు రాస్తారోకోల్లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకవైపు సకల జనుల సమ్మె, మరోవైపు రాస్తారోకోలు, నిరసనలతో నగరం దద్దరిల్లుతోంది. కాగా సచివాలయంలో విధులకు హాజరవుతున్న డ్రైవర్లను తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అడ్డుకున్నారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. డీసీపీ అకున్ సబర్వాల్ చర్యలను నిరసిస్తూ టీఎన్జీవో నేతలు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

No comments: