రామ్చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.
- త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ -‘‘మా బేనర్లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది.
- రామ్చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు.
- కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు.
- ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్లో ఉంది.
- ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది.
- అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.
- వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -‘‘ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది.
- అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ..
Oct 9, 2011
దిల్రాజు, వంశీ కాంబినేషన్లో రామ్చరణ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment