
జగన్ పేదలను ఓదార్చుకోడానికి యాత్రలు చేయడం లేదని, వాళ్ల దగ్గర ఇంకా ఏమి మిగిలిందో దోచుకుంటానికి యాత్ర చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. పేదలు తింటానికి తిండి లేకుండా ఉంటే జగన్ పద్దెనిమిది లక్షలతో కుర్చి కొని అనుభవిస్తున్నాడని ఆయన విమర్శించారు. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల, అదికారుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.తాను ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తానని కూడా ఆయన చెప్పారు. బీహారులో నితీష్ కుమార్ అవినీతి పరులైన ఐఎఎస్ ల ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారని, అలాగే ఇక్కడ కూడా జరగాలని అన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే ఆస్తులు పోయి , జైలుకు వెళతారన్న భయం ఉండాలని ఆయన చెప్పారు. సోనియాగాందీ దయతో పదవులలోకి వచ్చిన వారు జగన్ ఇతర నేతలు సోనియాను విమర్శిస్తుంటే స్పందించరా అని ఆయన అన్నారు. జగన్ తో కాంగ్రెస్ పార్టీ రాజీ కుదుర్చుకుందని ప్రచారం జరుగుతోందని, జగన్ తో రాజీ ప్రసక్తే లేదని వి.హనుమంతరావు స్పష్టం చేశారు.
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.
No comments:
Post a Comment