అధికార పార్టీ ఎంఎల్ఏగా తొలిసారి జిల్లాకు వచ్చిన చిరంజీవికి పరాభవం ఎదురయింది. ప్రధాన నాయకత్వమంతా గైర్హాజరయింది. చిరంజీవి చోటామోటా నాయకుల నుంచి స్వాగతం అందుకోవాల్సి వచ్చింది. టిటిడి పాలకమండలి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా స్థానిక ఎంఎల్ఏగా అధికారిక హోదాలో ఆయన హాజరయ్యారు. ఎంఎల్ఏలు, ఎంపిలు సహా జిల్లా నాయకత్వమంతా పెద్దఎత్తున చిరంజీవికి స్వాగతం పలకాలని చర్చ జరిగింది. అయితే తండోపతండాలుగా విమానా శ్రయానికి వెళ్లి ఘనంగా స్వాగతం పలుకుతారని అందరూ ఊహించారు. అయితే అందుకు భిన్నంగా జరిగింది. ద్వితీయశ్రేణి నాయకులు దొడ్డారెడ్డి రాంభూపాల్రెడ్డి, పాఠకం వెంకటేష్, మురళీనాధ్రెడ్డి, ముక్కుసత్యవంతుడు మాత్రమే హాజరై స్వాగతం పలికారు. స్థానిక మాజీ ఎంఎల్ఏ వెంకటరమణ, ఎంపి చింతామోహన్ అనుచరులు, ఎంఎల్ఏలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, షాజహాన్, కుతూహలమ్మ, సికెబాబు ఎవరూ రాలేదు. కాంగ్రెస్లో విలీనమైన పిఆర్పి శ్రేణులంతా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోవడం గమనార్హం.
చిరంజీవి సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
చిరంజీవి సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
No comments:
Post a Comment