Nov 3, 2011

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌

చురకత్తులుగా సంధించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా దానయ్య డి.వి.వి సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై యస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న సినిమా బుధవారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి యస్‌.యస్‌. రాజమౌళి క్లాప్‌ కొట్టగా మరో దర్శకుడు వి.వి.వినాయక్‌ కెమెరా స్విచ్చాన్‌్‌ చేసారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్‌.ఎస్‌.నారాయణ, ఎడిటర్‌ గౌతంరాజు, నిర్మాతలు అశోక్‌కుమార్‌, కె.యస్‌.రామారావు, బోగవల్లి ప్రసాద్‌, బూరుగుపల్లి శివరామకృష్ణ మరియు పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవానికి విచ్చేసారు.
చిత్ర నిర్మాత యస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ 'ఈ నెల 14 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. హైదరాబాదు, వైజాగులో జరుగుతుంది, రండు పాటలను విదేశాలలో చిత్రీకరిస్తాం. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన 'జల్సా' సినిమాకు ట్యూన్స్‌ అందించిన దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల రెండో వారం నుండి పాటలరికార్డింగ్‌ ప్రారంభం అవుతుంది' అన్నారు. చిత్ర సమర్పకులు దానయ్య డి.వి.వి మాట్లాడుతూ 'ఇది త్రివిక్రమ్‌ స్టయిల్‌లో ఉండే పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్‌ సినిమా. అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ లో నటిస్తున్న మూడవ సినిమా ఇది. ఫస్ట్‌ టైం బన్నీ సరసన ఇలియాన కధానాయికగా నటిస్తుంది. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలు వుంటాయో ఆ అంచనాలకు మించి ఈ సినిమా వుంటుంది. యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యత వుంటుందో కామెడీకీ అంతే ప్రాధాన్యత వుంటుంది. అర్జున్‌, డా|| రాజేంద్రప్రసాద్‌ల కామెడీ ఒ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సోనూసూద్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. నెక్ట్స్‌ ఇయర్‌ ఏప్రిల్‌లో సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'అన్నారు.

No comments: