- శ్రీరామరాజ్యం ఆడియో కార్యక్రమంలో తాను రామ్ చరణ్ను ఉద్దేశించి అనలేదని వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ విరవరణ ఇచ్చారు.
- తాను చిరింజీవి అన్యోన్యంగా ఉంటామని, తాను ఎవరి గురించి వ్యాఖ్యానించానో చిరంజీవి, మోహబాబులకు తెలుసునని బాలకృష్ణ తెలిపారు.
- తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే తట్టుకోలేనని ఆయన అన్నారు.
- రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై తెలంగాణ వ్యతిరేక ముద్రవేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తపరిచారు.
- అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తానని బాలకృష్ణ చెప్పారు.
బాలయ్య అన్నాడంటే అది తప్పయి ఉండదు: చిరంజీవి
- మొన్న మన బాలయ్య బాబు శ్రీ రామ రాజ్యం సినిమా పాటలు జనంలో బాగా అందుకొన్నందుకు హైదరాబాదులో పండుగ చేసుకొన్నాడు. అంటే సక్సస్ మీట్ అన్న మాట! అప్పుడు, అందరకి ఒక సంఘటన గురించి చెప్పాడు. "ఆ మద్య ఒకతను మన తెలుగు దర్శకులకన్న తమిళ్ దర్శకులే బాగా చేయగలరంటు ఏదేదో మన వాళ్ళ గురించి వాగుతుంటే, వెంటనే అతనికి అలా మాట్లాడవద్దని నేను గట్టి వార్నింగ్ ఇచ్చెను. మన వాళ్ళు ఎన్నెనో మంచి మంచి సినిమాలు తీసారు. అవేవి తెలుసుకోకుండా అలా వాగడం తప్పు కదా? అందుకే అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసాను," అని చెప్పాడు బాలయ్య బాబు.
ఇంతకీ బాలయ్య ఆ వార్నింగ్ ఇచ్చినది ఎవరికంటే రామ్ చరణ్ కి. అతను తమిళ్ దర్శకుడు మురుగదాస్ ఇటీవల తీసిన సినిమా సెవెంత్ సెన్స్ గురించి పొగుడుతూ ఆ తన్మయత్వంలో మన తెలుగు దర్శకులకి అటువంటివి తీయడం చేత కాదు అని నోరు జారెడుట. దానితో, మన బాలయ్య బాబు రామ్ చరణ్కి వార్నింగ్ ఇచ్చేడుట. క్లుప్తంగా ఇదీ కధ.
న్యూటన్ సిద్దాంతం ప్రకారం ప్రతి క్రియకి ప్రతి క్రియ ఉంటుందనట్లు, ఇది తెలిసిన మెఘాభిమానులు మనసు నొచ్చుకొన్నారు. అయితే, మెగా స్టారు చిరంజీవి మాత్రం "అలా అన్నది బాలయ్య బాబు అయితే అతను అన్నది కరెక్టే అయి ఉంటుంది" అని అనడంతో ఇక ఈ కధ ముగిసిందని అనుకోవాలి మనం.
No comments:
Post a Comment