Oct 9, 2011

దిల్‌రాజు, వంశీ కాంబినేషన్‌లో రామ్‌చరణ్

    • రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
    • త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ -‘‘మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది.


    • రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. 
    • కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. 
    • ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. 
    • ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. 
    • అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.


    • వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -‘‘ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. 
    • అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
     ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ..

No comments: