నందమూరి
బాలకృష్ణ హీరోగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్.ఎల్.కుమార్ చౌదరి ఓ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఆంధ్రుడు, పెదబాబు చిత్రాలను
తెరకెక్కించిన పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకుడు. లక్ష్మీరాయ్, సలోని
నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్నూల్లో జరుగుతోంది. ఈ
సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ ఈ చిత్రంలో బాలకృష్ణ
మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. మూడు పాత్రలు వేటికవే
అన్నట్లుగా అద్భుతంగా వుంటాయి. ఇటీవల కర్నూల్లో బాలయ్యపై చిత్రీకరించిన
పొలిటికల్ బ్యాక్వూడాప్ పాట చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. యాక్షన్,
సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో
సమపాళ్లలో వున్నాయి. తప్పకుండా ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో మరో
సంచలనాత్మకమైన చిత్రంగా నిలుస్తుంది. ఈ నెల 20 నుంచి యూరప్లో పాటలు
చిత్రీకరిస్తాం’ అన్నారు. జయసుధ,కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్రాజ్
తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణి మాలిక్,
సమర్పణ: సందీప్.
No comments:
Post a Comment