Pages

Oct 6, 2011

పండగరోజు టాలీవుడ్ హీరోల ఫస్ట్ ‌లుక్ !


పండగ ఎవరికైనా పండగే. కలియుగ దైవాలుగా పిలువబడే సినిమావారు కూడా పండక్కి దూరం కాదు. పండగ విశిష్టతను వారూ గుర్తింస్తుంటారు. అందుకే పండగ ప్రత్యేకతను గమనించి దర్శక, నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు పలు ప్రత్యేకతలు కలిగిన సినిమాలను తమవంతుగా తీసుకొస్తుంటారు. దానికి కారణం... సినిమా ప్రేక్షకులను ఆరోజు రెట్టింపు ఆనందపరచాలనుకోవడమే.

ఈ దసరాకి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ వేరువేరుగా నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన విభిన్నమైన గెటప్స్‌ను ప్రేక్షకులకు శాంపిల్‌గా ఊరిస్తూ దసరా సందర్భంగా ప్రజానీకానికి రుచి చూపిస్తున్నారు ఆయా చిత్రాల దర్శక, నిర్మాతలు.

ఆ సినిమాలకు సంబంధించిన గెటప్సే ఇక్కడ మీరు చూస్తున్న రెండూనూ. బాలయ్య పంచె కట్టులో విభిన్న వస్త్రధారణ చేసిన గెటప్ ‘శ్రీ కీర్తి కంబైన్స్’ బేనరులో పరుచూరి మురళి దర్శకునిగా, ఎమ్మెల్ కుమార్‌చౌదరి నిర్మిస్తున్న సినిమాలోనిది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో మరో రెండు గెటప్స్‌లో కూడా బాలకృష్ణ విజృంభిస్తుండటం విశేషం. అంటే... బాలయ్య ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారనమాట.

ఇక పవన్‌కళ్యాణ్ ‘పంజా’ విషయానికొస్తే... ‘బిల్లా’ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ‘ఫస్ట్‌లుక్’ను కూడా విడుదల చేశారు వారు.

ఇదిలా ఉండగా మరో ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాలకు సంబంధించి విశేషాలను కూడా ఈ పండగదినం సందర్భంగా దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఆ సినిమాల్లో ఒకరు ప్రభాస్ హీరో కాగా, ఇంకొకరు గోపీచంద్. తన స్నేహితులైన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలను నిర్మాతలుగా పరిచయం చేస్తూ, ఇప్పటివరకూ రచయితగా ఉన్న కొరటాల శివను కూడా దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రభాస్ ఈ నెలలోనే నటించబోతున్నారు.

ఇక గోపీచంద్ - చంద్రశేఖర్ యేలేటిల సినిమా కూడా ఈరోజే ప్రకటించబడింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఒక్కడున్నాడు’ సినిమాకి పనిచేశారు. ఈ కాంబినేషన్‌కి ఎప్పుడూ ఓ కొత్తదనం ఉంది. దానికి కారణం... మాస్ సినిమాలకు ఎక్కువగా అంకితమైపోయే గోపీచంద్, సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్‌గా ఉండే చంద్రశేఖర్ యేలేటి కలిసి పనిచేయడమే. ఈసారి ఈ కలయిక వెనుక మరో కొత్తకలయిక కూడా జోడయ్యింది. అది - ఈ దసరాకి ‘ఊసరవెల్లి’ వంటి భారీ చిత్రాన్ని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత కావడం. ఈ కొ‘త్రయం’ అందించే సినిమాకు ఇప్పుడు సన్నాహాలు మొదలయ్యాయి.
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో తెలియజేయండి. 

No comments:

Post a Comment