విజయదశమి తనకు విజయాన్ని అందిస్తుందని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం
వ్యక్తం చేశారు. ‘ఊసరవల్లి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫిల్మ్నగర్లో
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా రోజున
విడుదలవుతున్న ‘ఊసరవల్లి’ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులను
కోరారు. పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. కమర్షియల్ ఇమేజ్ను
వదలకుండా అన్ని రకాల సినిమాలు చేయాలన్నదే తన కోరిక అని జూనియర్ ఎన్టీఆర్
చెప్పారు. నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సురేందర్రెడ్డి, రచయిత
వక్కంతం వంశీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment