'తన బతుకు తెరువు కోసం రంగులు మార్చేది ఊసరవెళ్లి. కొందరి
రాతల్ని మార్చడానికి ఊసరవెల్లిలా. కన్పిస్తాను' అని ఎన్.టి.ఆర్.
తెలియజేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై
బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం
వహించారు. ఈనెల 6న విడుదలకానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని
ఎన్.టి.ఆర్. కొన్ని విషయాలను మంగళవారంనాడు మీడియాకు తెలియపర్చారు.
*
పాజిటివ్గా రంగులు మారుస్తుండే ఊసరవెల్లి కథ ఇది. చాలా అర్థవంతమైన
సినిమా. సురేందర్రెడ్డితో 2వ సినిమా చేశాను. దర్శకుడిగా అతనిలో చాలా
పరిణతి కన్పించింది. నా కెరీర్ మార్చింది 'అదుర్స్'. అందులో చారి పాత్రకు
ఎంతో ప్రశంస వచ్చింది. కొత్తగా ప్రయోగం చేయవచ్చనేందుకు ధైర్యాన్నిచ్చింది.
ఆ తర్వాత 'బృందావనం'లో మరో షేడ్ను ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత
వస్తున్న ఈ చిత్రం మరో కొత్తకోణంలో ఉంటుంది. తాత అన్ని రకాల పాత్రలతో
అలరించారు. అలాగే వారి అడుగుజాడల్లో నేను కూడా పలు భిన్నమైన పాత్రలు
చేయాలనుకుంటున్నా. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకుంటాను.
*
కథ విన్నప్పుడు ఎంతో ఉత్సాహాన్ని పొందాను. వెంటనే మార్పులు లేకుండా
అనుకున్నది అనుకున్నట్లు తీయమని రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు
సురేందర్రెడ్డికి చెప్పాను. ఇదే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులు పొందుతారనే
నమ్మకముంది. చిత్రాన్ని 112రోజుల్లో తీశాం. నా కెరీర్లో ఆది, సింహాద్రి
తర్వాత ఊసరవెల్లి అవుతుందని గట్టిగా నమ్ముతున్నా.
* ఈ పాత్రను
ఛాలెంజ్గా తీసుకున్నాను. సన్నివేశానికి ముందు హోంవర్క్ చేయడం అనేది
నమ్మను. స్పాట్లో తీసుకునే నిర్ణయాలు, డెవలప్మెంట్స్నే అనుసరిస్తాను.
షూటింగ్ నుంచి రాత్రి ఇంటికి వచ్చాక.. కుటుంబంతో గడపడంతోనే సరిపోతుంది. ఇక
హోంవర్క్ చేయడానికి టైమెక్కడుంది.
* పాటలకు గణేష్ నృత్యరీతులు
చేశాడు. నాకు ఇష్టమైన పాట 'నేనంటే..నాకు..' డాన్స్పరంగా దాండియా నృత్యం
చేశాను. ఇంతవరకు నా చిత్రాల్లో లేనిది. ఇక విజువల్పరంగా 'బ్రతకాలిరా..'
అనేది గొప్పగా ఉంటుంది. అసలు అందులోనే కథంతా ఉంటుంది. ఈ పాట
చేస్తున్నప్పుడే వేళ్లుచిట్లాయి. షూటింగ్లో దెబ్బలు తగిలితే హిట్ అనేది
కొందరంటున్నారు. నేనైతే నమ్మను. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
*
కథ విన్నప్పుడు హీరోయిన్ ఎవరు? అనేది చర్చలు జరిగాయి. ఆఖరికి తమన్నాను
ఎంపికచేశాం. తమిళం, తెలుగులలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె
నటన అద్భుతం. ఓ సన్నివేశంలో కన్నీరు తెప్పిస్తుంది.
* నా మొదటి
సక్సెస్ 'స్టూడెంట్ నెంబర్ 1' సెప్టెంబర్ 27న విడుదలైంది. 'బృందావనం'
దసరాకు విడుదలైంది. ఈసారికూడా విజయదశమికి ఊసరవెల్లి విడుదలవుతుంది.
యాదృశ్చికంగా అలా కలిసి వచ్చింది.
* రాత్రింబశళ్లూ ఎంతోమంది
కష్టించి చేసిన సినిమాను పైరసీ పేరుతో కొందరు దోచుకోవడం అనాగరికం. దాన్ని
ప్రోత్సహించకండి. ఎటువంటి సినిమానైనా థియేటర్లలోనే చూడండి
దర్శకుడు
సురేందర్రెడ్డి మాట్లాడుతూ...'ఏ హీరో అయినా కథలో మార్పులు చెబుతారు. కానీ
ఎన్.టి.ఆర్. కథ విన్న తర్వాత ఎలా అనుకుంటున్నారో అలా తీయమని చెప్పారు'
అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా
అత్యధిక ప్రింట్లతో విడుదల చేస్తున్నామని తెలిపారు.
No comments:
Post a Comment